Home » Kishan Reddy G
MP Balaram Nayak: కేంద్ర ప్రభుత్వంపై మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిన్నటి సమావేశానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని.. కలిసి డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తరభాగం పనులకు త్వరలో ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి తెలిపారు. ఈ రోడ్డును కేంద్రం సూత్రప్రాయంగా మంజూరు చేసిందని, క్యాబినెట్ ఆమోదానికి రంగం సిద్ధమవుతోందని చెప్పారు.
Kishan Reddy Letter to Bhatti: ఆల్ పార్టీ ఎంపీల సమావేశంపై తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. దీనిపై కిషన్రెడ్డి సమాధానమిస్తూ భట్టికి లేఖ రాశారు.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న పార్టీలే నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్)పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి చెప్పారు.
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసి సంబరపడుతున్న కిషన్రెడ్డి, బండి సంజయ్లు.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారు.
Telangana all party MP meeting: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ప్రధానంగా కేంద్రమంత్రులకు ఆహ్వానం పంపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి.. బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేసినా ప్రజలు పట్టించుకోలేదని తెలిపారు.
విమానాశ్రయాలను నిర్మించేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూ సేకరణ మాత్రమే చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని, నిత్యం అసూయతో రగిలిపోతున్నారని ఆరోపించారు.
పాలన వైఫల్యాలు, పార్టీలో, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే సీఎం రేవంత్రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, కేంద్రాన్నీ బద్నాం చేస్తున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు.