Home » KCR
కేంద్ర రాజకీయాల గులాబీ దళపతి కేసీఆర్(KCR) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను(BRS) 14 సీట్లలో గెలిపిస్తే దేశంలో తెలంగాణ(Telangana) తడాఖా చూపిస్తానని అన్నారు కేసీఆర్. శనివారం నాడు ప్రెస్మీట్లో మాట్లాడిన కేసీఆర్.. దేశ రాజకీయాలపై..
తెలంగాణలో రైతులు, చేనేత కార్మికుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శనివారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చిల్లర రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యం.. ప్రజా కార్యక్రమాలకు ఇవ్వడం లేదని ఆరోపించారు.
Telangana:జిల్లాలో బీజేపీ భారీ ర్యాలీ చేపట్టింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా భారీ ఎత్తున యువత తలివచ్చారు. అలాగే ర్యాలీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మహా బైక్ ర్యాలీలో బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ముస్లిం జనాభా 43 శాతం పెరిగిందన్నారు. హిందువుల జనాభా 8 శాతం తగ్గిందన్నారు. మోదీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్లా మారే ప్రమాదం ఉందన్నారు. కొన్ని ఇస్లాం సంస్థలు భారత్ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర చేస్తున్నాయని పేర్కొన్నారు.
నేటి సాయంత్రం ఆరు గంటలకు పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. అరవై రోజుల పాటు సాగిన ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. పోలింగ్కు 48 గంటల ముందు మైకులు ఆగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటల వరకే పోలింగ్ జరగనుంది.
‘‘తెలంగాణ రాష్ట్రం.. మూర్ఖ ముఖ్యమంత్రి, మూర్ఖ ప్రభుత్వం చేతుల్లో ఉంది. కాంగ్రెస్ అలవికాని హామీలిచ్చి అరచేతిలో వైకుంఠం చూపి నోటికొచ్చిన వాగ్దానాలు చేసి గద్దెనెక్కింది. గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది. మోసపోతే గోసపడుతాం.. జాగ్రత్తగా అలోచించి ఓటేయాలి.
బీజేపీ ఒక రకమైన క్యాన్సర్లాంటిదని, ఆ పార్టీ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ వేలూనుకుంటే శాంతిని, భద్రతను మర్చిపోవాల్సిందేనన్నారు. బీజేపీ అడుగు పెడితే సమాజం నిట్టనిలువునా చీలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా, రాష్ట్రానికి పెట్టుబడులు, ఆదాయమూ రావని ఆందోళన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు మూడు రోజుల సమయమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా కరీంనగర్ నుంచి సిరిసిల్లకి వెళ్తుండగా కేసీఆర్కి మిడ్ మానేరు నిర్వాసితుల నిరసన సెగ తగిలింది.
Telangana: ‘‘ప్రభుత్వాన్ని కాపాడుకునే సత్తా మాకుంది. మేం 11 మందిమి మంచి టీమ్గా పని చేస్తున్నాం. మా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదు. రేవంత్ సీఎంగా, భట్టి డిప్యూటీ సీఎంగా, మేం మంత్రులుగా కలిసి పనిచేస్తున్నాం. మేమంతా క్రికెట్ టీంలా పనిచేస్తున్నాం’’ అని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు.
Telangana: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్షాన్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండ సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. ‘‘మీ బడుగు బలహీన వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. కేసీఆర్ సీఎం, హరీష్ రావు మంత్రి అయ్యారు అంటే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లే. నరేంద్ర మోదీ ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.