Home » KCR
మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని వ్యాఖ్యానించారు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేయనుంది సిట్. ఎర్రవల్లిలోని ఫాంహౌస్కు వెళ్లి మరీ సిట్ అధికారులు నోటీసులు అందజేయనున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల పలువురు తెలంగాణ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి సీతక్క, టీపీసీసీ చీఫ్, కేటీఆర్ తదితరులు.. అజిత్ మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మేడారం జాతర ప్రారంభం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా జీవించేలా దీవించాలని సమ్మక్క సారలమ్మ దేవతలను ఆయన ప్రార్థించారు.
బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢాచారి సంతోష్ అని ఆరోపించారామె.
సిట్ విచారణ పూర్తిగా చట్టప్రకారమే జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అవసరమైతే కేసీఆర్కు సైతం నోటీసులు ఇస్తామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్, హరీశ్ రావు సహా ముఖ్య నేతలు సమావేశంకానున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫాంహౌస్లో ఈ సమావేశం జరుగనుంది.
మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఎంవీఎస్ కాలేజ్లో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాలనలో పాలమూరును పట్టించుకోలేదని విమర్శించారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలు వెనకబడిన జిల్లాలని.. ఇప్పుడు ఈ రెండు జిల్లాలు అభివృద్ధి దిశగా వెళ్తున్నాయన్నారు.