Home » Kalyanadurgam
మండలంలో అర్థాంతరంగా ఆగిపోయిన గ్రామ సచివాలయాల భవనాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి చొరవతో మోక్షం లభించనుంది. గత వైసీపీ పాలనలో మండలంలోని పలు గ్రామ సచివాలయ భవనాలు నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపో యింది.
రీ సర్వే పనులను పక డ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదే శించారు. ఆయన మంగళవారం కంబదూరు మండల పరిధిలోని తి మ్మాపురం, ఓబిగానిపల్లిలో జరుగుతున్న రీసర్వే పనులను ఆకస్మి కంగా తనిఖీ చేశారు. తహసీల్దారు బాలకిషనను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు అవకా శం వుంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొ న్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమంపై బుధవారం పట్టణంలో ని ఏడో వార్డులో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు.
కంబదూరు మండల కేంద్రంలో కన్నీటి కష్టా లు రోజురోజుకీ అధికమవుతున్నాయి. ఆర్నెల్లు గా బిందెడు నీటి కోసం ప్రజలు నానా తం టాలు పడుతున్నారు. ఇక గత్యంతరం లేక ట్యాంకర్లను పెట్టి నీటిని కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది. లోతట్టు ప్రాంతాలకు బిం దెడు నీరు దొరకాలంటే ఎన్ని రోజులు పడు తుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని పలు కాలనీల ప్రజలు వాపోతున్నారు.
సత్యసాయి తాగునీటి పథకంలో పని చేస్తున్న కార్మికుల సమ్మె నాలుగోరోజుకు చేరింది. శుక్రవారం పీఏబీఆర్ డ్యాం లోని సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు వద్ద కార్మికులు నిరసనకు దిగారు. వేతనాలు చెల్లించాలని, న్యాయ మైన కోర్కెలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మండలంలో రీసర్వే పనులు సక్ర మంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం శెట్టూరు మండలం లోని కైరేవు గ్రామంలో రీసర్వే పనులలో భాగంగా సర్వే నంబర్ 25లో జరుగుతున్న గ్రౌండ్ ట్రూథింగ్ పనులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు.
మండలకేంద్రమైన కంబ దూరు మారెమ్మ దేవాలయం వద్ద ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన మ్యాన హోల్ లీకేజీ అవుతోంది. దీంతో మురుగునీరంతా రోడ్డుపై పారుతోంది. రెండేళ్ల నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ సం బంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలన అంతా ఆ పార్టీ నాయకులు దోచుకుని, దాచుకున్నారని ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు విమర్శించారు. కంబదూరు మండల పరిఽధిలోని మేళ్లకుంట క్రాస్ నుంచి ఐపార్శపల్లి వరకు రూ. 3కోట్లతో చేపట్టిన సుమారు ఎనిమిది కిలోమీటర్ల తారు రోడ్డు పనులను ఎమ్మెల్యే శనివా రం ప్రారంభించారు.
పట్టణంలో ఏడు పెట్రోల్ బంకులు ఉండగా ఆరింటిలో నో స్టాక్ బోర్డులు పెట్టేశా రు. దీంతో పెట్రోలు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటు న్నారు. పట్టణంలోని కోర్టు పక్కన ఉన్న పెట్రోల్ బంకులో మాత్రమే సోమవారం పెట్రోల్, డీజిల్ వేస్తుండగా వాహనదారులు బారులు తీ రారు.
మండల పరిధిలోని శ్రీరంగాపురం రంగమ్మ చెరువులో అధికారుల పర్యవేక్షణ లోపంతో మట్టి మాఫియా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ చెరువులోని ఒండ్రుమట్టికి మంచి గిరాకీ ఉంది. దీంతో గ్రామానికి చెందిన ఇద్దరు వైసీపీ నాయకులు పది రోజుల నుంచి ఎక్స్కవేటర్లు పెట్టి తరలిస్తూ దోపిడీ చేస్తున్నారు.