Home » JNTU
నగరంలోగల జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు ఉన్నతాధికారులు తీపికబురు చెప్పారు. గ్రాడ్యుయేటెడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2026 పరీక్ష రాయాలనుకునే విద్యార్థులకు ఉచిత కోచింగ్ రూపంలో నూతన సంవత్సరం కానుకను అందజేస్తున్నారు.
నగరంలోగల జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీలో పదోన్నతుల ప్రక్రియ కొలిక్కిరాలేదు. దీంతో ఆచార్యుల్లో అసహనం వ్యక్తమవుతోంది. 2022 నుంచి తాము పదోన్నతులకు అర్హులమే అయినప్పటికీ, ఇంతకు ముందున్న ఉన్నతాధికారులు తమ మొర ఆలకించలేదని వాపోతున్నారు.
హైదరాబాద్ లోగల జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సటీలో ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన నెలకొంది. పాలకమండలిలో కీలక సభ్యులైన ముగ్గురు ఐఏఎస్లు.. ఆచార్యులకు ప్రమోషన్లు కల్పించడంలో నిబంధనలను పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలను జేఎన్టీయూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. ఫీజు బకాయిల గురించి విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపొద్దు’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ఓ బహిరంగ సభలో ప్రైవేటు కళాశాలలను హెచ్చరించారు. అయినప్పటికీ ప్రభుత్వ కళాశాలైన జేఎన్టీయూ అధికారులే ఖాతరు చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి.
జేఎన్టీయూలో పనిచేస్తున్న ఆచార్యుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద అర్హులైన ఆచార్యులకు పదోన్నతుల ప్రక్రియను జేఎన్టీయూ చేపట్టింది. దీంతో ఆచార్యుల్లో ఒకింత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
కూకట్పల్లిలోగల జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ(జేఎన్టీయూ)లో నాన్బోర్డర్స్పై అధికార యంత్రాంగం కొరడా ఘుళిపిస్తోంది. ఈ మేరకు క్వార్టర్స్ ఖాళీ చేయకుంటే పీహెచ్డీ డిగ్రీలు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి.
జేఎన్టీయూలో కీచక ప్రొఫెసర్ బండారం బయటపడింది. గెస్ట్ ఫ్యాకల్టీపై లైంగిక దాడికి పాల్పడిన ప్రొఫెసర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దేశాన్ని నడిపిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులను సృష్టించిన జేఎన్టీయూను జాతీయ ఆస్తిగా పరిగణించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం జేఎన్టీయూలో జరిగిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జేఎన్టీయూ హైదరాబాద్ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రైవేటు కాలేజీల్లోని రీసెర్చ్ కేంద్రాల్లో పరిశోధనలకు అనుమతిస్తున్నట్లు జేఎన్టీయూ వైస్చాన్స్లర్ టి.కిషన్కుమార్ రెడ్డి ప్రకటించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం వర్సిటీ ప్రాంగణంలోని నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం, కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, ఆచార్యులతో వీసీ మాట్లాడారు.