Home » JNTU
దేశాన్ని నడిపిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులను సృష్టించిన జేఎన్టీయూను జాతీయ ఆస్తిగా పరిగణించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం జేఎన్టీయూలో జరిగిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
జేఎన్టీయూ హైదరాబాద్ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రైవేటు కాలేజీల్లోని రీసెర్చ్ కేంద్రాల్లో పరిశోధనలకు అనుమతిస్తున్నట్లు జేఎన్టీయూ వైస్చాన్స్లర్ టి.కిషన్కుమార్ రెడ్డి ప్రకటించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం వర్సిటీ ప్రాంగణంలోని నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం, కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, ఆచార్యులతో వీసీ మాట్లాడారు.
జేఎన్టీయూలో బోధనేతర (నాన్టీచింగ్) పోస్టుల్లో సుమారు 40 మంది ప్రొఫెసర్లు పని చేస్తుండడాన్ని జేఎన్టీయూహెచ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఆక్షేపిస్తోంది.
జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పడి 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా నవంబరు 21, 22 తేదీల్లో వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ వైస్చాన్స్లర్ టి.కిషన్కుమార్రెడ్డి ప్రకటించారు. క్యాంపస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల డైమండ్ జూబ్లీ లోగోను ఆవిష్కరించారు.
జేఎన్టీయూలో పీహెచ్డీ సీట్ల సంఖ్యను పెంచే అంశం వైస్చాన్స్లర్ కిషన్కుమార్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందా అంటే.. విద్యార్థి సంఘాల నుంచి అవుననే జవాబు వినిపిస్తోంది. 213 సీట్ల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీచేయగా, విద్యార్థి సంఘాల వినతి మేరకు సీట్ల పెంపు ప్రతిపాదనపై వైస్చాన్స్లర్ సమాలోచనలు చేశారు.
ఎట్టకేలకు జేఎన్టీయూలో పీహెచ్డీ ప్రవేశాలకు మోక్షం లభించింది. సెప్టెంబరులో నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు నెలరోజులుగా అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అర్హులైన అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు తాజాగా అడ్మిషన్ల విభాగం అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.
జేఎన్టీయూకు అనుబంధంగా ఉన్న మూడు ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో పాటు పలువురు ఆచార్యులను బదిలీ చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం
విద్యార్థులను జేఎన్టీయూ నిలువునా దోచుకుంటోందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్కు యూజీ, పీజీ అడ్మిషన్ల నోటిఫికేషన్లను, ప్రాజెక్టుల సమర్పణకు పర్మిషన్లు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్న జేఎన్టీయూ పరిపాలన విభాగం.. వన్టైమ్ చాన్స్లో బ్యాక్లాగ్ సబ్జెక్టులను పూర్తి చేసిన పీజీ అభ్యర్థులపై పెనాల్టీలను బాదుతోందని ఆరోపిస్తున్నాయి.
ఉన్నత చదువులు కోరుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం వివిధ యూజీ, పీజీ కోర్సులను అందుబాటులోకి తేవడంలో జేఎన్టీయూ నిర్లక్ష్యం వహిస్తోంది.