Home » Jayalalitha
దివంగత సీఎం జయలలిత మృతిపై జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐతో దర్యాప్తు చేయించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోమంత్రి అమిత్షా, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు విజ్ఞప్తి చేశారు.
అన్నాడీఎంకే కార్యాలయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఢిల్లీకి మార్చారంటూ ఎద్దేవా చేసిన డీఎంకే లోక్సభ సభ్యురాలు కనిమొళికి ఆయన కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రాన్ని 30యేళ్లకు పైగా పరిపాలించిన అన్నాడీఎంకే మరింత బలపడడానికి అనుభవం కలిగిన వారి సలహాలను పాటించాలని దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ అభిప్రాయపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్లో జరిగిన వరుస సంఘటనలపై, ఈ కేసులతో సంబంధం ఉన్న ఆత్తూర్ రమేష్ను సీబీసీఐడీ అధికారులు విచారించారు. ఈ ఎస్టేట్లో వాచ్మన్ హత్య, మరోవాచ్మన్పై హత్యాయత్నం, దోపిడీ, కంట్రోల్రూమ్ ఇన్ఛార్జి ఆత్మహత్య తదితర సంఘటనలపై విచారణ జరుపుతున్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్లో జరిగిన హత్య, దోపిడీ కేసు విచారణకు సయాన్ హాజరయ్యారు. నీలగిరి జిల్లాలో జయలలితకు చెందిన అత్యంత ఖరీదైన ‘కొడనాడు ఎస్టేట్’ ఉంది. దీంట్లోనే జయలలితకు చెందిన బంగారం నగలు, భూముల పత్రాలు, ఇతరత్రా ఆసంతులకు సంబంధించిన పత్రాలు ఉండేవని సమాచారం.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ హత్యకు సంబంధించి ‘ఇంటర్పోల్’ విచారణ నివేదిక కోసం వేచి ఉన్నామని ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలియజేశారు. జయలలితకు ఊటీ సమీపంలో కొడనాడు ఎస్టేట్ పేరుతో పెద్దపెద్ద భవనాలున్నాయి.
Jayalalitha Assets: తమిళ ప్రజల ఆరాధ్య దైవం అమ్మగా జయలలిత ఖ్యాతి పొందారు. 2016 డిసెంబర్లో ఆమె తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో మరణించారు. అయితే పలుమార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు.
అనారోగ్యం కారణంగా, చెన్నై అపోలో ఆసుపత్రిలో మాజీ సీఎం జయలలిత చికిత్స పొందిన సమయంలో నెలకొన్న ఘటనలపై సీబీఐతో దర్యాప్తుచేయించాలంటూ దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
నీలగిరి జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సొంతమైన కొడనాడు ఎస్టేట్(Kodanadu Estate)లో జరిగిన హత్య, దోపిడీ తదితర ఘటనలకు సంబంధించిన కేసును ఇంటర్పోల్ సాయంతో విచారణ జరపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) పేర్కొన్నారు.
అక్రమార్జన కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు విధించిన జరిమానా సొమ్ము రూ.100 కోట్ల వసూలు దిశగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa)కు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయడానికి రంగం సిద్ధమైంది.