Home » Israel
ఇరాన్ అణు కార్యక్రమంపై సంచలన సమాచారం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ తప్పుడు పోస్టు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఆ పోస్టులోని తప్పుడు సమాచారాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు.
హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానంటూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది. ట్వీట్లు లేదా సైనిక శక్తి ద్వారా హోర్ముజ్ జలసంధిని సొంతం చేసుకోవడం సాధ్యం కాదని, ఆ జలసంధి ఎప్పటికీ ఇరాన్ పరిధిలోనే ఉంటుందని పేర్కొంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయా? ఇరాన్పై మరో దాడి జరగబోతోందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా వర్గాలు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు ప్రచురించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. తనకున్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని పేర్కొన్నారు.
ఇరాన్తో సైనిక ఘర్షణలు 6వ నెలకు చేరుకున్నప్పటికీ ముగింపునకు రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఉన్నత సలహాదారుల బృందంలో తీవ్ర భేదాభిప్రాయాలే దీనికి కారణమని అంతర్జాతీయ మీడియా అంటోంది.
న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. నెతన్యాహు ఓ యుద్ధ నేరస్థుడని, అతడు న్యూయార్క్కు వస్తే కచ్చితంగా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తామని మమ్దానీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
వాషింగ్టన్ తెస్తున్న ఒత్తిడి, బెదిరింపు రాజకీయాలకు ఇరాన్ ఎప్పటికీ తలొగ్గదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. 'షాంఘై సహకార సంస్థ' విదేశాంగ మంత్రుల సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఇరాన్ సైనిక లక్ష్యాలే ధ్యేయంగా అమెరికా దళాలు వరుసగా 13వ రోజు కూడా వైమానిక దాడులను కొనసాగిస్తున్నాయి.
హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ జరిపే ప్రతీ దాడికి ప్రతిస్పందనగా ఆ దేశపు వంతెనలు, ఒక్కో విద్యుత్ ప్లాంట్ను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు బెదిరించిన నేపథ్యంలో ఇరాన్ అంతే ఘాటుగా స్పందించింది. తాజాగా ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చింది.