Home » Israel
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటనకు గాను ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారంనాడు ఒక సదస్సులో విషయాన్ని వెల్లడించారు.
ఇజ్రాయెల్కు భారీ స్థాయిలో ఆయుధాల సరఫరాకు అమెరికా సిద్ధమైంది. 6.67 బిలియన్ డాలర్ల విలువైన హెలికాప్టర్లు, ఇతర మిలిటరీ వాహనాలు, ఆయుద్ధ సంపత్తిని విక్రయించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం శుక్రవారం ఓ కీలక ప్రకటన చేసింది.
సాధారణంగా ఒక దేశ అత్యున్నత, సెన్సిటివ్ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. సాధారణ వ్యక్తులు అలాంటి ప్రాంతాలకు వెళ్లలేరు. వీఐపీలు కూడా అక్కడ కొన్ని ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రోటోకాల్స్ విషయంలో ప్రధాని లేదా దేశ అధ్యక్షులకు మినహాయింపులు ఉంటాయి.
నిరసనకారులకు మద్దతుగా రంగంలోకి దిగుతామన్న అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. మధ్య ప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించింది. ఇజ్రాయెల్ను కూడా టార్గెట్ చేసుకుంటామని పేర్కొంది.
వెస్ట్ బ్యాంక్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వెస్ట్ బ్యాంక్లో రోడ్డు పక్కన నమాజ్ చేసుకుంటున్న ఓ వ్యక్తిని ఇజ్రాయెలీ సెట్లర్ ఒకరు తన ఏటీవీ వాహనంతో ఢీకొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
హమాస్ను ఉగ్రసంస్థగా గుర్తించాలని ఇజ్రాయెల్ భారత్ను కోరింది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు. పాక్ ఉగ్ర సంస్థ ఎల్ఈటీతో హమాస్కు సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన తర్వాత భద్రతా సమస్యల కారణంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఆయన పర్యటన రద్దవడం ఇది మూడోసారి.
హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ ఆఫ్ స్టాఫ్ను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. లెబనాన్ రాజధాని బీరుట్లో ఆదివారం జరిగిన ఈ దాడిలో ఐదుగురు మరణించారు. 24 మందికి పైగా గాయపడ్డాడు.
గాజాలో మరణాలు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్ (TLP) కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో పాకిస్థాన్ రణరంగంగా మారింది. గతవారం మొదలైన ఈ ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో దాని ఫలితాలు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. దీంతో దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ సైనికులకు ఇవాళ విముక్తి లభించింది.