Home » Iran War
పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపన దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు పడింది. దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో ఒక కీలకమైన 'ప్రాథమిక ఒప్పందం' కుదిరింది.
శాంతి చర్చల మధ్య సైనిక దాడులు చేయడం అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో దాడులకు పాల్పడటం శాంతి ఒప్పంద స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని పేర్కొంది.
స్విట్జర్లాండ్లో జరిగిన ఇరాన్-యూఎస్ శాంతి చర్చల్లో పాల్గొనేందుకు వెళ్లిన పాకిస్థాన్ సైన్యాధిపతి, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను లక్ష్యంగా చేసుకుని, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ 'మొసాద్' వ్యూహాత్మక దాడికి ప్రణాళిక రచించిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీకి ఆహ్వానం అందింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. చమురు ఉత్పత్తి, రవాణా సానుకూలంగా మారిన నేపథ్యంలో చమురు గిరాకీ తగ్గింది. దీంతో ధరలు పతనమవుతున్నాయి.
ఇరాన్లో భద్రతా పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ, అత్యవసరమైతే తప్ప అక్కడకు వెళ్లవద్దని భారత పౌరులకు టెహ్రాన్లోని ఇండియన్ ఎంబసీ సూచించింది.
ఇరాన్తో ఘర్షణల నేపథ్యంలో తన సైనిక అధికారాలకు కత్తెర వేస్తూ అమెరికా సెనేట్ తీర్మానం ఆమోదించడంపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది.. తన పనిని మరింత కష్టం చేసిందని, ప్రపంచంలోనే నంబర్ వన్ ఉగ్రవాద స్పాన్సర్ అయిన ఇరాన్కు సహాయం, ఓదార్పు అందించినట్లైందని విమర్శించారు.
ఇరాన్ మిసైల్స్ ప్రోగ్రామ్పై ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందంలో ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్ భాగం కాదని, భవిష్యత్తులో కూడా దీనిని ఎలాంటి ఒప్పందాలలోనూ చేర్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
అమెరికా రాజకీయాల్లో ఒక అరుదైన, కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్పై సైనిక చర్యలు తీసుకునే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాలను పరిమితం చేస్తూ యూఎస్ సెనేట్ ఒక చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది.
ఇరాన్కు నిధులు ఇవ్వటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ఆంక్షల సడలింపు ద్వారా అన్ఫ్రీజ్ చేయబడిన లేదా యుఎస్ ట్రెజరీ ద్వారా విడుదల చేయబడిన నిధులు వాషింగ్టన్ నియంత్రణలో ఉండే ఎస్క్రో ఖాతాలోకి వెళ్తాయని తెలిపారు.