Home » International News
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా భారీ అణు సామర్థ్యం గల క్షిపణి పరీక్ష నిర్వహించడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికా సైన్యం కాలిఫోర్నియా తీరంలో ఉన్న వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి శక్తిమంతమైన మినిట్మ్యాన్-3 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ బుధవారం నాడు భీకరంగా విరుచుకుపడింది. ఇరాన్కు చెందిన యాక్-130 యుద్ధ విమానాన్ని టెహ్రాన్ గగనతలంలో ఇజ్రాయెల్ అడ్వాన్స్డ్ ఎఫ్-35 యుద్ధవిమానం కూల్చేసింది.
మధ్యఆసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. నాటో సభ్యదేశమైన తుర్కియే వైపు దూసుకువెళ్తున్న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని నాటో ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ బుధవారం నాడు ధ్వంసం చేసింది.
ఇజ్రాయెల్-అమెరికా కూటమి, ఇరాన్ మధ్య యుద్ధంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్కు చెందిన నౌకపై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ దాడిలో 101 మంది గల్లంతయ్యారు.
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త కూటమి మధ్య యుద్ధం ఐదోరోజైన బుధవారంనాడు మరింత తీవ్రమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత్తలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్ క్షిపణి లాంచర్లు, ఆయుధ ఫ్యాక్టరీలను టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ఈ యుద్ధంతో చమురు ధరలు కొండెక్కి వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం భారీగా పెరిగే ప్రమాదం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధ ప్రభావం ఈ నెల నుంచే ప్రారంభమవుతుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మొజ్తాబాను కొత్త సుప్రీం లీడర్గా ఎన్నిక చేశారని సమాచారం. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పదవిలో లేని మొజ్తాబా ఒక్కసారిగా సుప్రీం లీడర్గా ఎన్నికవ్వటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులతో హడలెత్తిస్తున్న వేళ ఇరాన్ను భూకంపం కూడా వణికిస్తోంది. ఇరాన్లోని గెరాష్ ప్రాంతంలో కాసేపటి క్రితం 4.3 తీవ్రతతో భూకంపం సంభంచింది.
ఇరాన్ నగరం కోమ్లో దేశ సుప్రీం నేతను ఎన్నుకునే 'కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్స్ట్' భవనంపై ఇజ్రాయెల్ మంగళవారంనాడు గగనతల దాడులు జరిపింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ అధికారులు ధ్రువీకరించారు.