Home » International News
అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా భీకర దాడులు చేపట్టింది. హర్మూజ్ జలసంధి సమీపంలో 16 ఇరానియన్ మైన్లేయర్లను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.
మధ్యప్రాచ్యంలో యుద్ధ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో తాను చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చని అన్నారు. అయితే పరిస్థితులను బట్టి అది ఉంటుందన్నారు.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇరాన్ విదేశీ వ్యవహారాల వ్యూహాత్మక మండలి సలహాదారు కమల్ ఖారాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. దౌత్య భాష అమెరికాకు తెలియదని, ఆ దేశంతో సుదీర్ఘ యుద్ధానికి ఇరాన్ ఆర్మీ సిద్ధంగా ఉందని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
దేశీయంగా మిలట్రీ-గ్రేడ్ డ్రోన్ల ఉత్పత్తికి అమెరికా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులు డ్రోన్ల తయారీ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు.
ఫ్లోరిడాలో రిపబ్లికన్ మెంబర్స్ ఇష్యూస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ మాట్లాడుతూ, మూడున్నర రోజుల్లో ఇరాన్ నావికాదళానికి చెందిన 46 నౌకలను అమెరికా మిలటరీ సముద్ర గర్భంలో ముంచేసిందని, అవన్నీ సముద్రం అడుగున పడి ఉన్నాయని తెలిపారు.
ప్రపంచ దేశాలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్న ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, చమురు ధరలు కిందకు దిగి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ విషయంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి చేరువలో ఉన్నామన్నారు.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. ఇజ్రాయెల్పై, గల్ఫ్లోని చమురు రిఫైనరీలు.....
ఇరాన్ కొత్త సుప్రీం నేత మజ్తాబా ఖమేనీకి రష్యా అభినందనలు చెప్పగా, కొత్త సుప్రీంను మట్టుబెడతామంటూ ఇజ్రాయెల్ మిలటరీ చేస్తున్న హెచ్చరికలతో చైనా విభేదించింది.
సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతంలో సైనిక ప్రొజెక్టైల్ పడిపోవడంతో ఒక భారతీయుడు మృతి చెందినట్టు వచ్చిన వార్తలను రియాద్లోని భారత రాయబార కార్యాలయం సోమవారంనాడు తోసిపుచ్చింది. అల్ ఖర్జ్ వద్ద జరిగిన దాడి ఘటనలో భారత్కు చెందిన వ్యక్తి ఎవరూ చనిపోలేదని వెల్లడించింది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ఆయతుల్లా సయ్యద్ మొజ్తాబా హుస్సేనీ ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.