Home » IAS
ఏపీ ఆరోగ్య శాఖకు అవినీతి క్యాన్సర్ పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ను ప్రభుత్వం బదిలీ చేసింది.
దేశంలో రిజర్వేషన్ల ఫలాలు అందుకొని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు.. తరతరాలుగా అదే కోటాను కోరుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులై, ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు, ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకని ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశి భూషణ్ కుమార్కు జలవనరుల శాఖ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు నిప్పులు చెరిగింది. ఉద్యోగుల పట్ల రాగద్వేషాలతో వ్యవహరించే వ్యక్తి ఐఏఎస్ అధికారిగా కొనసాగడానికి వీల్లేదంది. చట్టం అన్నా, కోర్టు ఉత్తర్వులన్నా ఆయనకు గౌరవం లేదని మండిపడింది.
తెలంగాణ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్పై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఐఏఎస్ అధికారిపై వచ్చిన ఫిర్యాదును మూడు నెలల్లోగా తేల్చాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కరీంనగర్ జిల్లాలో సీపీ గౌస్ ఆలం పెద్ద ఎత్తున నగదు వసూల్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఆ ఆధారాలు అన్ని త్వరలోనే బయట పెడతానని తెలిపారు.
‘‘ప్రేమలో పరస్పర గౌరవం, ఆర్థిక స్వాతంత్య్రం అత్యంత ముఖ్యం’’ అంటారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్ జి. సృజన. ఆమెది ప్రేమ వివాహం.
మహిళా ఐఏఎస్ అధికారి గురించి ఓ మీడియా సంస్థ తప్పుడు కథనాలు ప్రసారం చేయడాన్ని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ చేయడం బాధాకరమని అన్నారు.
మహిళా ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనాలు ప్రసారమవడంపై తెలంగాణ ఐఏఎస్ సంఘం స్పందించింది. మహిళా ఐఏఎస్పై ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాన్ని తక్షణమే అన్ని ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలని హెచ్చరించింది..
హైదరాబాద్ లోగల జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సటీలో ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన నెలకొంది. పాలకమండలిలో కీలక సభ్యులైన ముగ్గురు ఐఏఎస్లు.. ఆచార్యులకు ప్రమోషన్లు కల్పించడంలో నిబంధనలను పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది.