Home » HYDRA
నగరంలోని మాదాపూర్ ఏరియాలోగల దుర్గంచెరువు దుర్గంధంపై ‘హైడ్రా’ దృష్టిసారించింది. ప్రస్తుతం చెరువు చుట్టుపక్కల కొంద ఆక్రమణలకు గురవడమేగా, మరికొంత వ్యర్ధాలతో నిండిపోతోంది. అయితే.. దీనిపై హైడ్రా నజర్ పెట్టినట్లు సమాచారం.
హైదరాబాద్ మహానగరంలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన కూకట్పల్లి పరిధిలో మూడువేల గజాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 35 కోట్లు ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 12.17 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా కాపాడింది. దీని విలువ కోట్లల్లో ఉంటుందని అంచనా. హైదరాబాద్ నగరమేగాక చుట్టుపక్కల ప్రాంతాల్లో కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములు, ఆస్తులను హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంటోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఓ స్థలం కబ్జా ఆరోపణల నేపథ్యంలో హైడ్రా ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ మహానగరంలోగల దుర్గంచెరువు ఆక్రమణలకు ‘హైడ్రా’ పెడుతోంది. ఇందులో భాగంగా దాదాపు 5 ఎకరాల మేర కబ్జాకు గురైనట్లు గుర్తించారు. వీటిని తొలగించి ప్రభుత్వ ఆస్తులను కాపాడింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైడ్రా.. ఓ పాక్కును కాపాడింది. అయితే.. ఈ స్థలాల విలు రూ. 13 కోట్లు ఉంటుందని అంచనా. శేరిలింగంపల్లి మండలం, మదీనగూడ విలేజ్లో పార్కు కోసం స్థలాన్ని కేటాయించగా.. ఓ వ్యక్తి కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మించాడు. అయితే దీనిపై ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా.. ఆ స్థలాన్ని కాపాడింది.
హైదరాబాద్ మహా నగరంలో ప్రతీ చెరువును పర్యాటక ప్రాంతంలా అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ ఆవుల వెంకట రంగనాథ్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. పతంగుల పండుగ నాటికి చెరువులను సిద్ధం చేయాలన్నారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వద్ద గన్మెన్ గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య తన ఇంట్లో గన్తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.
వరద ముప్పులేని నగరం కావాలి... అలాగే వరద ముప్పులేని నగరం అందరి లక్ష్యం కావాలి.. అన్నారు హైడ్రా కమిషనర్ ఆవుల వెంకట రంగనాథ్. ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాదిలో వర్షాకాలం ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత వరద నియంత్రణలో విజయవంతమయ్యామన్నారు.
2026లో లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే ధ్యేయంగా పనిచేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... 15 నెలల కాలంలో 60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను, భూములను హైడ్రా రక్షించిందని ఆయన అన్నారు.