Home » HYDRA
కొండాపూర్లోని రాఘవేంద్ర కాలనీలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి సొంతం చేసుకునే ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. 2వేల చదరపు గజాల స్థలాన్ని శుక్రవారం కాపాడింది. దీని విలువ సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా పేర్కొంది.
బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల నాదర్గుల్లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను(వెంచర్) బుధవారం కూల్చివేశారు. ఇక్కడ 1986లో టెలికాం కో - ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఒక వెంచర్గా దాదాపు 100 ఎకరాల భూమిలో ప్లాట్లను ఏర్పాటు చేసి, సొసైటీ సభ్యులకు పంపిణీ చేసింది.
కొండాపూర్లో హైడ్రా అధికారులు శనివారం కూల్చివేతలు చేపట్టారు. కొండాపూర్లోని భిక్షపతి నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా సిబ్బంది.
ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను గత నెలలో హైడ్రా అధికారులు పలు శాఖల అధికారుల సమన్వయంతో కూల్చి వేసిన విషయం తెలిసిందే. అక్టోబరులో మళ్లీ భారీ స్థాయిలో కూల్చివేతలు చేపడతామని స్థానికులకు చెప్పి వెళ్లారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. రిటర్నింగ్ వాల్ పడిపోవడంతో ఎంజీబీఎస్కు వరద పోటెత్తిందని రంగనాథ్ తెలిపారు.
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ఉద్ధృత ప్రవాహానికి గోల్నాకలోని అంబేద్కర్ నగర్ నీటి మునిగింది. దీంతో పలు కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
నగరంలో మూసీ నది ప్రవాహిస్తున్న ఉద్ధృతికి చాల ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది.
మూసి నదిలో పెరిగిన వరద ఉద్ధృతికి పురానాపూల్ శివల ఘాట్ వద్ద ఉన్న శివాలయం మునిగిపోయింది. ఆ సమయంలో దేవాలయంలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడే చిక్కుకపోయారు.
భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు. వర్షాలపై నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు.