Home » HYDRA
హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో హైటెక్స్.. దాని సమీపంలో ప్రభుత్వ భూమి.. ఆ వెంటే ఒక కుంట చుట్టూ ఆక్రమణలు.. ఆక్రమిత స్థలం మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో మెకానిక్ షెడ్లు.. గ్యారేజీలు, ఐరన్ అండ్ స్టీల్ షాపులు, ఇతర దుకాణాలు ఏర్పాటు చేసి అద్దెలకిచ్చారు.
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా మరో భారీ ఆపరేషన్ను చేపట్టింది. మాదాపూర్ హైటెక్స్ సమీపంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ.2200 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్లోని కొండాపూర్ జంగంకుంట ఆక్రమణలపై హైడ్రా సీరియస్ అయ్యింది. దాదాపు రూ.700 కోట్ల విలువైన భూమిని కబ్జాదారుల నుంచి రక్షించింది..
నగరంలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన మణికొండలో అక్రమంగా నిర్మిస్తున్న రెండు భవనాలను హైడ్రా సీజ్ చేసింది. హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుంటోంది. ఇప్పటికే కోట్లాది రూపాయల స్థలాలను స్వాధీనం చేసుకుంది.
నాంపల్లి ప్రాంతంలో ఉన్న బచ్చాస్ ఫర్నిచర్ షాపులో ఇటీవల చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనను హైడ్రా సీరియస్గా తీసుకుంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా హైడ్రా చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్ మహానగరంతోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, స్థలాలను రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా.. మరో కోట్లాది రూపాయల విలువ చేసే పభుత్వ భూమిని కాపాడగలిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నగరంలోని మాదాపూర్ ఏరియాలోగల దుర్గంచెరువు దుర్గంధంపై ‘హైడ్రా’ దృష్టిసారించింది. ప్రస్తుతం చెరువు చుట్టుపక్కల కొంద ఆక్రమణలకు గురవడమేగా, మరికొంత వ్యర్ధాలతో నిండిపోతోంది. అయితే.. దీనిపై హైడ్రా నజర్ పెట్టినట్లు సమాచారం.
హైదరాబాద్ మహానగరంలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన కూకట్పల్లి పరిధిలో మూడువేల గజాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 35 కోట్లు ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 12.17 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా కాపాడింది. దీని విలువ కోట్లల్లో ఉంటుందని అంచనా. హైదరాబాద్ నగరమేగాక చుట్టుపక్కల ప్రాంతాల్లో కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములు, ఆస్తులను హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంటోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఓ స్థలం కబ్జా ఆరోపణల నేపథ్యంలో హైడ్రా ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.