Home » HYDRA
హైదరాబాద్ మహా నగరంలో ప్రతీ చెరువును పర్యాటక ప్రాంతంలా అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ ఆవుల వెంకట రంగనాథ్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. పతంగుల పండుగ నాటికి చెరువులను సిద్ధం చేయాలన్నారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వద్ద గన్మెన్ గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య తన ఇంట్లో గన్తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.
వరద ముప్పులేని నగరం కావాలి... అలాగే వరద ముప్పులేని నగరం అందరి లక్ష్యం కావాలి.. అన్నారు హైడ్రా కమిషనర్ ఆవుల వెంకట రంగనాథ్. ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాదిలో వర్షాకాలం ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత వరద నియంత్రణలో విజయవంతమయ్యామన్నారు.
2026లో లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే ధ్యేయంగా పనిచేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... 15 నెలల కాలంలో 60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను, భూములను హైడ్రా రక్షించిందని ఆయన అన్నారు.
హైదరాబాద్లోని ఐటీ కారిడార్ కొండాపూర్లో సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా.. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి కబ్జా జరిగినట్లు గుర్తించింది.
అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ను అధికారులు కూల్చివేశారు. సంధ్యా శ్రీధర్ రావు తమ ప్లాట్లను ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టారు.
మాజీమంత్రి కేటీఆర్కు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.హైడ్రాని భూతంలా చూపించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.
కోట్ల రూపాయలు విలువ చేసే మరో ప్రభుత్వ స్థలాల్ని రేవంత్ సర్కారు కాపాడింది. హైదరాబాద్ మియాపూర్లోని ఐదంతస్తుల భవనాన్ని హైడ్రా ఈ ఉదయం కూల్చివేసి స్థలం స్వాధీనం చేసుకుంది. పోలీసులను మోహరించి..
కొండాపూర్లోని రాఘవేంద్ర కాలనీలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి సొంతం చేసుకునే ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. 2వేల చదరపు గజాల స్థలాన్ని శుక్రవారం కాపాడింది. దీని విలువ సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా పేర్కొంది.
బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.