Home » HYDRA
హైకోర్టు స్టే ఆదేశాలను ఉల్లంఘించి ప్రైవేటు ఆస్తులను కూల్చివేసిన ఆరోపణలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై రాష్ట్ర హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ అభియోగాలు మోపింది.
హైదరాబాద్లో సరూర్నగర్ స్టేడియం వద్ద తోపులాట జరిగింది. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు.
ఇంటర్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరో 48 కాలేజీల చిట్టాను హైడ్రా అధికారులు పోలీసులకు అందజేశారు.
తెలంగాణ మాజీ ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకాలను ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఫోర్జరీ చేయటం కలకలం రేపుతోంది. నాగిరెడ్డి సంతకాలతో తప్పుడు ఎన్వోసీలు సృష్టించుకున్నాయి.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు ఎనిమిది ప్రైవేటు కాలేజీలు.. రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ ఫైర్ ఎన్వోసీలను(NOC) సృష్టించిన కళాశాలలు.. వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి.
హైడ్రా కమిషనర్గా ఏవీ రంగనాథ్ను తొలగించి సరైన అధికారిని కమిషనర్గా నియమించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ జూకంటి అనిల్కుమార్ ఇటీవల ఇచ్చిన తీర్పును హైకోర్టు మరో జడ్జి జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ సమర్థించారు. అంతేకాక, హైడ్రా తీరును తప్పుబడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైడ్రా బుల్డోజర్ల చర్యలపై బీఆర్ఎస్ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
వర్షాకాలంలో అత్యవసర ఖర్చుల కోసం హైడ్రాకు రూ.72 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం జీవో జారీ చేసింది.
రాజ్యాంగ స్ఫూర్తితోనే తాను విధులు నిర్వర్తిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఆర్టికల్ 21, 48A ప్రకారమే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ చేస్తున్నట్లు ఆయన వివరించారు. నిజాయితీ, నిర్భయంతో పనిచేయడమే హైడ్రా ధైర్యం అని అభివర్ణించారు.
రాష్ట్రంలో హైడ్రాను నిషేధిస్తే పేదల ఇళ్లు సురక్షితంగా ఉంటాయని తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్. రాంచందర్ రావు అన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఆయన స్పందించారు.