Home » Hyderabad
ఆజామాబాద్ డివిజన్, హైదరాబాద్ సిటీ-2 పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి.వినోద్కుమార్ తెలిపారు.
తెలంగాణ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇప్పటి వరకు 11 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్ అఫిషియో సభ్యులు కీలకం కానున్నారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.
హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో హైటెక్స్.. దాని సమీపంలో ప్రభుత్వ భూమి.. ఆ వెంటే ఒక కుంట చుట్టూ ఆక్రమణలు.. ఆక్రమిత స్థలం మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో మెకానిక్ షెడ్లు.. గ్యారేజీలు, ఐరన్ అండ్ స్టీల్ షాపులు, ఇతర దుకాణాలు ఏర్పాటు చేసి అద్దెలకిచ్చారు.
దుబ్బాక విఠలేశ్వరాలయంలో శివలింగ పీఠంపై కాళికాదేవీ సమేతంగా ఆసీనుడైన యోగభైరవుని శిల్పం గుర్తించారు. ఇది పాశుపత శైవంలో కీలకమైన కాలాముఖ సంప్రదాయానికి చెందినదిగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం నిర్ధారించింది.
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 50, బజ్జి మిర్చి 28, కాకరకాయ 38లకు విక్రయిస్తున్నారు.
బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా మరో భారీ ఆపరేషన్ను చేపట్టింది. మాదాపూర్ హైటెక్స్ సమీపంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ.2200 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకుంది.
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నాలుగు కొత్త ఎయిర్పోర్టుల అభివృద్ధి, తదితర అంశాలపై చర్చించారు.