Home » Hyderabad
సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాల వివరాలు అందజేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమీషన్ల కోసం బ్యాంక్ ఖాతాలను నేరగాళ్లకు ఇచ్చి, అక్రమ లావాదేవీలకు సహకరిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
హైదరాబాద్ లోని గచ్చిబౌలి వేదికగా జరిగిన ఆలిండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి హెల్త్ వీక్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. తొలి రోజు ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు.
హైదరాబాద్: కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు పోలీసులు.
సింగరేణి సంస్థ గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం అవగాహన లేకపోవటం సిగ్గుచేటని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కార్మికుల మీద ప్రేమతో సంస్థను కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలన్న సోయి ప్రభుత్వానికి లేదన్నారు. పార్టీలు ఏవైనా సరే అందులో ఉండే ట్రేడ్ యూనియన్లు మాత్రం కార్మికుల కోసమే మాట్లాడాలని కవిత హితవుపలికారు.
హైదరాబాద్ మహానగరంలో మరో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. పార్టీపై రైడ్ చేసి మాదక ద్రవ్యాలు సేవిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందుతుల్లో డీజే ప్లేయర్, వ్యాపారులతోపాటు ఓ మోడల్ కూడా ఉన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఈగట్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ వేదికగా నేడు సన్రైజర్స్తో లఖ్నవూ జట్టు తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్కు వరణుడు ఆటంకం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రయోగాత్మకంగా మూడు గంటల పాటు వన్వేను అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఆదివారం నుంచే ట్రాఫిక్ మళ్లింపులు మొదలవ్వనున్నాయి.
హైదరాబాద్లో మామిడికాయలకు రసాయనాలు వేసి, విషపూరితం చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. గోషామహల్లో నిల్వ ఉంచిన మామిడికాయలపై ఎథిలీన్ వేసి రంగు మారుస్తున్న నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
బాసర ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ ఆలయ అభివృద్ధి ఉండాలన్నారు.