Home » Hyderabad
హైదరాబాద్లోని నల్లకుంటలో దారుణ ఘటన జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. భర్త అతికిరాతంగా హత్య చేశాడు.
హైదరాబాద్ నగరంలో వేర్వేరు ఏరియాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇరువురు దుర్మరణం పాలయ్యారు. కూతురును చూసి తిరిగి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. సోదరుడిని ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చేందుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మరొకరు దుర్మరణం పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి.
కూకట్పల్లి రైతుబజార్లో కూరగాయల ధలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు కేజీ బెండకాయలు రూ. 20 నుంచి 40 వరకు అమ్మగా.. ప్రస్తుతం రూ. 55కు విక్రయిస్తున్నారు. అలాగే దొండకాయను రూ. 40కి విక్రయిస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే...
31 అర్ధరాత్రి, నూతన సంవత్సన వేడుకల సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా మొత్తం 120 ప్రాంతాల్లో 7 ప్లటూన్ల పోలీసులు గస్తీలు నిర్వహించేలా నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్ని ఏర్పాట్లు చేశారు.
రైల్వే శాఖ కొత్తగా ప్రతిపాదించిన ఛార్జీల పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ప్రతి కిలోమీటర్ కు స్వల్పంగా (1 లేదా 2 పైసల) పెంపు ఉన్నా సబర్బన్ ప్రయాణికులు, సీజనల్ టికెట్ దారులపై భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. సాధారణ, ప్రీమియం రైళ్లకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. రిజర్వేషన్ ఫీజు, సూపర్ ఫాస్ట్ చార్జీలలో ఎలాంటి మార్పు లేదని రైల్వే అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లుగా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 150 వార్డులుండగా.. దానిని ప్రస్తుతం 300 వార్డులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. కాగా.. కుత్బుల్లాపూర్ జోన్లో అత్యధికంగా ఏడు సర్కిళ్లను ఏర్పాటు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పునర్విభజనకు సంబంధించిన నోటిఫికేషన్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ...
హైదరాబాద్ మహానగరంలో మరిన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈమేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్య నియంత్రణ, ఆర్ధిక వెసులుబాలో భాగంగా నగరంలో మరిన్ని ఎలక్ర్టిక్ బస్సులు నడపాలని నిర్ణయించారు.
నూతన సంవత్సరాన్ని పురష్కరించుకుని 2 ఎంఎంటీఎస్ స్పెషల్స్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. లింగంపల్లి నుంచి ఫలక్నుమాకు, నాంపల్లి రైల్వేస్టేషన్కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వేశాఖ తెలిపింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఎంతటి వాయు కాలుష్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్ మహా నగరంలోనూ వాయు కాలుష్యం విజృంభిస్తోంది.