Home » Hyderabad City Police
నగరంలో మూసీ నది ప్రవాహిస్తున్న ఉద్ధృతికి చాల ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది.
మూసి నదిలో పెరిగిన వరద ఉద్ధృతికి పురానాపూల్ శివల ఘాట్ వద్ద ఉన్న శివాలయం మునిగిపోయింది. ఆ సమయంలో దేవాలయంలో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడే చిక్కుకపోయారు.
రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో కత్తితో గొంతుకోసి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు ఆనవాళ్లు గుర్తించామని పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు. తెలంగాణ సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం.
స్నేహితుడి ఇంటికే కన్నం వేసిన ఘటన హైదరాబాద్, బంజారాహిల్స్లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఉదయ్ నగర్కు చెందిన శివరాజ్ ఈ నెల 16వ తేదీన కుటుంబ సభ్యులతో నిజామాబాద్ వెళ్లాడు.
హైదరాబాద్, కుషాయిగూడ పరిధిలోని రాధిక థియేటర్ సమీపంలో భార్య గొంతు కోసి హత్య చేశాడు ఓ భర్త. భార్య బంధువుల ఇంట్లో ఉన్న సమయంలో హత్య చేసి.. భర్త పరారయ్యాడు.
సైబరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అనేది కత్తిమీద సాములా ఉంటుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ విభాగంలో విస్తృతమైన మార్పులు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గోనెసంచిలో మహిళా మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
హైదరాబాద్ నగరంలోని ఓ రిటైర్డ్ మహిళా అధికారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడింది. 76 ఏళ్ల రిటైర్డ్ అధికారిని డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు వేధించారు.
జింక మాంసం రవాణా చేస్తున్న మొహమ్మద్ సలీం, మొహమ్మద్ ఇక్బాల్ అనే ఇద్దరి నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాంసం, బొలెరో వాహనాన్ని అటవీ శాఖ అధికారులకి అప్పగించినట్లు పేర్కొన్నారు.