Home » Hussain Sagar
సిటీలోని పలు ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు హుస్సేన్ సాగర్కి వచ్చి చేరుతోందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తూముల ద్వారా మూసీలోకి వరద నీటిని వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంది.
రాబోయే ఏడాది వినాయక్ సాగర్లో చేసే గణనాథుల నిమజ్జనాలను మంచి వర్షపు నీటిలో చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ఇలా చేస్తే రేవంత్రెడ్డికి, గణేష్ భక్తులందరికీ తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ 2 లక్షల 61 వేలకు పైగా గణేష్ ప్రతిమలను నిమజ్జనం చేశారు. ఒక్క హుస్సేన్ సాగర్లోనే 11వేల గణేశ్ విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
హైదరాబాద్లో ఇవాళ వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
దేశవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనాలతో భక్తులు పరవశించిపోతున్నారు. ఇక, హైదరాబాద్ మహానగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేల సంఖ్యలో గణనాథుని విగ్రహాలు నగరవ్యాప్తంగా కొలువుదీరాయి. కాగా, ఇవాళ(శనివారం) 11వ రోజు కావడంతో వందల సంఖ్యలో విగ్రహాలు హుస్సేన్ సాగర్తో సహా పలు ప్రాంతాల్లో నిమజ్జనం అవుతున్నాయి. ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం..
దేశవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా వివిధ రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జనాలతో భక్తులు పరవశించిపోతున్నారు. ఇక, హైదరాబాద్ మహానగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేల సంఖ్యలో గణనాథుని విగ్రహాలు నగరవ్యాప్తంగా కొలువుతీశారు. కాగా, ఇవాళ(శుక్రవారం) పదో రోజు కావడంతో వందల సంఖ్యలో విగ్రహాలు హుస్సేన్ సాగర్ సహా పలు ప్రాంతాల్లో నిమజ్జనం అవుతున్నాయి. ఆ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం..
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటినట్లు అధికారులు చెబుతున్నారు. బంజారా, పికెట్, కూకట్ పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వరద నీరు వచ్చి చేరింది.
జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్లకు మళ్లీ వరద మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఈసీ, మూసీ నదుల్లో వరద వస్తోంది. హిమాయత్సాగర్, గండిపేట జలాశయాల్లో 250 క్యూసెక్కుల చొప్పున వరద వచ్చి చేరుతోంది.
హైదరాబాద్ మహా నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి పర్చేందుకు హెచ్ఎండీఏ సిద్ధమైంది. రూ.100 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టింది.