Home » HMDA
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ ప్రక్రియ షురూ అయ్యింది. ఓ వైపు సికింద్రాబాద్ నుంచి 44వ జాతీయ రహదారి మీదుగా కండ్లకోయ వరకు, మరోవైపు సికింద్రాబాద్ నుంచి శామీర్పేట వైపు వచ్చే ఈ ఎలివేటెడ్ కారిడార్లకు రక్షణ శాఖ భూములే కీలకంగా మారాయి.
అనతికాలంలోనే మెట్రోరైలు(Metro Rail) అమిత ప్రజాదరణ పొందింది. ట్రాఫిక్, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్నవర్గాలకు చేరువైంది. మెరుగైన రవాణాను అందిస్తోంది. తొలిరోజుల్లో సగటున 1.60 లక్షల నుంచి 2.10 లక్షల మంది రాకపోకలు సాగించగా, ప్రస్తుతం 4.80 లక్షల నుంచి 5.10 లక్షల వరకు ప్రయాణిస్తుండడం ఆసక్తికరంగా మారింది.
ఉద్దేశపూర్వకంగా నీటి సరఫరాలో ఆటంకాలు కల్పించే సిబ్బందిని విధుల నుంచి తప్పిస్తామని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్(Municipal Department Chief Secretary M. Danakishore) హెచ్చరించారు. నగరంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఉండకూడదని వాటర్బోర్డు అధికారుల్ని ఆదేశించారు.
భాగ్యనగర వాసులకు హైదరాబాద్ తాగునీటి సరఫరా మండలి(Hyderabad Metropolitan Water Supply Sewerage Board) ఓ ప్రకటన జారీ చేసింది.
Telangana: ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) పై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.
Telangana: ఎల్ఆర్ఎస్పై(లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాటకు దిగింది. మార్చి 6న అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. 7న జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను కలిసి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది.
Telangana: మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు షాకిచ్చారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలిగించారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ లే అవుట్లో 2500 గజాల భూమిని మల్లారెడ్డి ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేశారు.
Telangana: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి బాగోతం మరవక ముందే మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కింది. రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Telangana: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. బాలకృష్ణ బినామీలను అధికారులు ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా బాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేస్లో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. శివ బాలకృష్ణ కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉన్నట్టు చూపించి ఫేక్ సంస్థలు ఏర్పాటు చేసి ఫేక్ ఐటి రిటర్న్స్ ఫైల్ చేసినట్టు గుర్తించారు. సౌందర్య బోటిక్, శారి వర్క్స్ పేరుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు.