Home » Heavy Rains
భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ముంబైతోపాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ...
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు.
Telangana heavy rains: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో 17.9 సెం.మీ భారీ వర్షం కురిసింది. కౌడిపల్లి 17.2, పెద్ద శంకరంపేట 16.4, దామరంచ 15.8, మాసాయిపేట 14.8 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు అనేక జిల్లాలను అతలాకుతలం చేశాయి. వానల కారణంగా జూన్ 20 నుంచి ఆగస్టు 16 వరకు రాష్ట్రంలో ఏకంగా 261 మంది మరణించారని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. కొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి. చాలా చోట్ల చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రోడ్లు తెగిపోయాయి.
వరుసగా మూడ్రోజులపాటు మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు చేరుతోంది. శుక్రవారం 404.70 అడుగులకు నీటి మట్టం పెరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని పాకాల కొత్తగూడం నుంచి గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం అటవీ ప్రాంతాల నుంచి జలాశయానికి 1,700 క్యూసెక్కుల చొప్పున నీరు చేరడంతో డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు.
నగరంలో శుక్రవారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వరద ప్రవాహం కనిపించింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రదేశాల్లో ఇబ్బందులు తలెత్తాయి.
ష్ట్రంలో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు రెండు రోజులకు పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలెర్ట్లను జారీ చేసింది.