Home » Harish Kumar
ఏపీలో మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటనలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. పోలీసు అధికారులు ప్రణాళిక ప్రకారం సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు.
నేర పరిశోధన, ప్రజల శ్రేయస్సులో పోలీసు జాగిలాలది కీలక పాత్రని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. పోలీసు జాగిలాల శిక్షణతో పాటు, వాటి సంరక్షణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని హోంమంత్రి అనిత సూచించారు.
రానున్న వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని, వినాయక ఉత్సవ మండప నిర్వాహకులు సింగిల్ విండో విధానం ద్వారా, ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందని.. పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్లు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఏపీ పోలీసులు ఫీల్డ్ లెవల్లో బాగా పని చేసి మంచి ఫలితాలు చూపించారని చెప్పుకొచ్చారు. వయలెన్స్ పోతేనే ఎక్కడైనా అభివృద్ధి సాధ్యమవుతుందని.. అందుకే వీటిపై ప్రధానంగా దృష్టి పెట్టామని ఉద్ఘాటించారు. గతంలో లొంగిపోయిన మావోయిస్టులకి కూడా నేడు రివార్డులు అందజేస్తున్నామని ప్రకటించారు. మావోయిస్టులు పునరాలోచన చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.
కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు లేవని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తాము పరదాలు కట్టుకుని దాక్కుని వెళ్లడంలేదని చెప్పారు. ప్రజలతో, ప్రజల మధ్య తిరుగుతున్నామని వివరించారు. తెనాలి ఘటనలో కులం, మతం ఎందుకు తెస్తున్నారని అనిత ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుల్ టైం డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పోలీసు దళానికి నిర్ణయాత్మక, క్రమశిక్షణ కలిగిన, దార్శనిక నేతృత్వాన్ని హరీష్ గుప్తా అందించనున్నారని..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను సీఎం నారా చంద్రబాబునాయడు నియమించారు. ఇవాళ్టి నుంచి రెండు సంవత్సరాల పాటు డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగనున్నారు.
CM Chandrababu: తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్లలో అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలను ఊపేక్షించవద్దని హెచ్చరించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
AP DGP Harish Kumar Gupta: డ్రగ్స్ ఫ్రీ ఏపీగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.