Home » Harish Kumar
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోతున్న వారికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు, కొన్ని గ్రూప్లు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.
బెట్టింగ్,జూద కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఏపీలో ఆన్లైన్ గేమింగ్ పేరిట జరుగుతున్న బెట్టింగ్, జూద కార్యకలాపాలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.
సురక్షిత బాల్యంతోనే సుస్థిర భవిష్యత్తు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు. ఏపీ వ్యాప్తంగా 'ఆపరేషన్ చిన్నారి తల్లి' ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించినట్లు తెలిపారు.
2025 సంవత్సరానికి గాను వార్షిక నేరాల నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విడుదల చేశారు. నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నేరాలను మరింత తగ్గించేలా నూతన ఏడాదిలో పోలీసులు పని చేస్తారన్నారని ఈ సందర్భంగా డీజీపీ తెలిపారు.
ఏపీలో మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటనలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. పోలీసు అధికారులు ప్రణాళిక ప్రకారం సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు.
నేర పరిశోధన, ప్రజల శ్రేయస్సులో పోలీసు జాగిలాలది కీలక పాత్రని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. పోలీసు జాగిలాల శిక్షణతో పాటు, వాటి సంరక్షణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని హోంమంత్రి అనిత సూచించారు.
రానున్న వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని, వినాయక ఉత్సవ మండప నిర్వాహకులు సింగిల్ విండో విధానం ద్వారా, ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇటీవల ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందని.. పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్లు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఏపీ పోలీసులు ఫీల్డ్ లెవల్లో బాగా పని చేసి మంచి ఫలితాలు చూపించారని చెప్పుకొచ్చారు. వయలెన్స్ పోతేనే ఎక్కడైనా అభివృద్ధి సాధ్యమవుతుందని.. అందుకే వీటిపై ప్రధానంగా దృష్టి పెట్టామని ఉద్ఘాటించారు. గతంలో లొంగిపోయిన మావోయిస్టులకి కూడా నేడు రివార్డులు అందజేస్తున్నామని ప్రకటించారు. మావోయిస్టులు పునరాలోచన చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.
కూటమి ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు లేవని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తాము పరదాలు కట్టుకుని దాక్కుని వెళ్లడంలేదని చెప్పారు. ప్రజలతో, ప్రజల మధ్య తిరుగుతున్నామని వివరించారు. తెనాలి ఘటనలో కులం, మతం ఎందుకు తెస్తున్నారని అనిత ప్రశ్నించారు.