Home » Harbhajan Singh
పీసీబీ ఛైర్మన్ నఖ్విపై టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ను ప్రపంచ కప్ టోర్నీ నుంచి తొలగించడంపై నఖ్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి విషయంలో పాకిస్తాన్ జోక్యం ఎందుకు అంటూ భజ్జీ ప్రశ్నించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న తరుణంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. టీమిండియాకు ఓ కీలక సూచన చేశాడు. భారత్ ఈ మెగా టోర్నీలో కచ్చితంగా ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. రాయ్పుర్ వేదికగా జరిగిన రెండో టీ20 సందర్భంగా కామెంట్రీలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియాకు ప్రస్తుతం గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్. అయితే అతడి నేతృత్వంలో టెస్టు క్రికెట్లో భారత్ తీవ్రంగా విఫలమవుతోంది. దీంతో టెస్టులకు వేరే కోచ్ను నియమించాలని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అనూహ్యంగా ఈ జట్టులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ దేశవాళీల్లో అదరగొడుతున్న విషయం తెలిసిందే. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున సెంచరీ బాది తొలి సారి టైటిల్ అందించాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ మెరుపు శతకం బాదాడు. ఈ సందర్భంగా అతడి ఫామ్పై దిగ్గజ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు.
రానున్న వన్డే ప్రపంచ కప్లో రో-కోలను ఆడించాలని టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ యాజమాన్యానికి సూచించాడు. వారు అద్భుతమైన ఫామ్లో ఉన్నారని.. వారి కంటే మెరుగైన ఆటగాళ్లు లేరని వెల్లడించాడు.
క్రికెట్ ప్రియులకు ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. టీమిండియా మాజీ ప్లేయర్లు శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనున్నారు.
అబుదాబి టీ10 లీగ్లో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆస్పిన్ స్టాలియన్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. ప్రత్యర్థి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాక్ బౌలర్ దహానీకి భజ్జీ షేక్హ్యాండ్ ఇవ్వడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది.
సౌతాఫ్రికాతో టీమిండియా తొలి టెస్ట్ ఓడిపోవడంపై మాజీ స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. టెస్టు క్రికెట్ను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్వదేశంలోనే ఛేదించలేకపోవడం ఏంటని ప్రశ్నించాడు.
సొంతగడ్డపై వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.