Home » Guntur
జలధార- జలహారతి కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ను నోడల్ అధికారిగా సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ విషయాన్ని జలధార కార్యక్రమం అమలుపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ప్రకటించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం నియంత్రణలో పలు సంస్కరణలు చేపట్టామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని, భారీ స్కామ్ కూడా జరిగిందని ఆరోపించారు.
రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా వైఎస్ జగన్ అడ్డుకుంటున్నారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. లూలు వంటి ప్రముఖ కంపెనీలు కూడా జగన్ దెబ్బకు భయపడి రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయాయని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో జనగణనకు ప్రజలు సహకరించాలని ఏపీ జనగణన అధికారి జె.నివాస్ కోరారు. ఎన్యూమరేటర్లకు అవసరమైన వివరాలు తప్పకుండా అందించి సెన్సస్ ప్రక్రియకు పూర్తి సహకారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను లాయర్ సురేశ్ హత్య చేశాడని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఎన్డీయే ఎంపీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి లోకేశ్, ఎన్డీయే ఎంపీలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఏపీలో జనగణనకు ప్రజలు సహకరించాలని కూటమి ప్రభుత్వం కోరింది. మార్చి 12న కేంద్రం ఇచ్చిన సర్క్యులర్ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
పల్నాడు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పల్నాడు జిల్లా మాచర్ల ఏఎస్సై శ్రీనివాసరావుపై సస్పెషన్ వేటు పడింది. విద్యార్థినిలు, మహిళలను వేధిస్తుండడంతో ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఇటీవల పూర్తి చట్టబద్ధత లభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్రతో అమరావతి రైతులు, ఏపీ ప్రజల కల నెరవేరింది. రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు వెల్లివిరిశాయి.