Home » Guntur
రాజకీయాల కోసం ఈ ప్రాంతంలో వైషమ్యాలు పెంచిన వాళ్లను గతంలో చూశామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఒకే రోజున రూ.3 వేల కోట్లను కూటమి ప్రభుత్వం అందించిందని తెలిపారు.
గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం చోటుచేసుకుంది. నిత్యం మద్యం తాగి వచ్చి వేధిస్తున్న కుమారుడిని తల్లిదండ్రులే హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
ఉపా కేసులో యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ రావణ్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రావణ్ భార్య అనూష ఆశ్రయించారు.
రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ (గొడ్డలి పార్టీ) ఇప్పటికీ కుట్రలు కొనసాగిస్తోందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ఆరోపించారు. రాజధాని అభివృద్ధికి 99.5 శాతం మంది రైతులు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని, భూములు ఇవ్వని అరశాతం మంది రైతులను అడ్డం పెట్టుకుని అమరావతిపై విష ప్రచారం చేస్తోందని విమర్శించారు.
వియత్నాం పడవ ప్రమాద బాధితులకు అన్ని విధాలా సహాయ చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13న వరుసగా మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. తూర్పు గోదావరి, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో కుటుంబ కలహాలు దారుణానికి దారితీశాయి. భార్యను కాపురానికి పంపడం లేదన్న ఆగ్రహంతో అత్తమామలపై అల్లుడు కారుతో దూసుకెళ్లాడు.
గ్రామాల్లో విలేజ్ మార్ట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాల అమ్మకాలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 51 పట్టణ స్థానిక సంస్థల స్ట్రీట్ వెండింగ్ ప్లాన్లకు ఆమోదం తెలిపింది. వీధి వ్యాపారుల రక్షణ, నియంత్రణ చట్టం-2014 ప్రకారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.