Home » Godavari
ప్రకాశం బ్యారేజి వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దుర్గమ్మ భక్తులు జల్లు స్నానాలు ఆచరించాలని సూచిస్తున్నారు. అటు, గోదావరి వరద ఉధృతి కూడా తీవ్రంగా ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 10.88 లక్షల క్యూసెక్కులు..
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరికలకు చేరువలో ప్రకాశం, ధవళేశ్వరం బ్యారేజీలు ఉన్నాయి. భద్రాచలం వద్ద 44.9లక్షలు, ధవళేశ్వరం వద్ద ఇన్, ఔట్ ఫ్లో 9.88 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
గోదావరి, కృష్ణా పుష్కరాల నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో టెంపుల్ సెంట్రిక్ ఘాట్స్ అభివృద్ధిపై పలు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్రెడ్డి.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఒకటో ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయింది. బ్యారేజ్ వద్ద గంట గంటకూ గోదావరి నీటి ప్రవాహం పెరుగుతోంది. 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు.
మల్లన్నసాగర్ నుంచి మహా నగరానికి గోదావరి జలాలను తీసుకురావడంతో పాటు, జంట జలాశయాలను నింపి మూసీనదిలో ప్రవహింపజేసే గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్టుకు క్లియరెన్స్లు చకచకా మొదలయ్యాయి.
పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన శ్రీరాం సాగర్ నుంచి దిగువన భద్రాచలం వరకు భారీగా ప్రవాహం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం మెల్లగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తోంది.
ఎగువన కురిసిన భారీ వర్షాలు, వస్తున్న వరదతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గురువారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద నీటిమట్టం 51.9 అడుగులు ఉండగా వరద ప్రవాహం 13.66 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 3.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయడంతో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు తగ్గుముఖం పడుతూ వచ్చిన గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది.
మూడు రోజులుగా గోదావరి పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు 20.8అడుగులున్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటలకు 23.6 అడుగులకు చేరింది.