Bhadrachalam: పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:15 PM
మూడు రోజులుగా గోదావరి పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు 20.8అడుగులున్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటలకు 23.6 అడుగులకు చేరింది.
- భద్రాచలం వద్ద 26.3 అడుగులకు చేరిన నీటిమట్టం
భద్రాచలం: మూడు రోజులుగా గోదావరి పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం(Bhadrachalam) వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకు 20.8అడుగులున్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటలకు 23.6 అడుగులకు చేరింది. 12 గంటలకు 25.4, 4గంటలకు 26.3అడుగులకు చేరగా.. రాత్రికి 28 అడుగుల వరకు చేరే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా భద్రాచలం గోదావరి స్నానఘట్టాలపై నుంచి నీరు ప్రవహిస్తోంది. భక్తులు, పర్యాటకులకు తెలిసేందుకు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News