Home » Germany
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో జర్మనీ సహా ఇతర నాటో మిత్రదేశాల మద్దతు తక్కువగా ఉందన్న అసంతృప్తితో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న అమెరికా సైనికుల్లో 5 వేల మందిని తగ్గించే యోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇరాన్ తీరుతో అమెరికాకు అవమానాలు ఎదురవుతున్నాయని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ అభిప్రాయపడ్డారు. చర్చల్లో ఇరాన్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.
రాజ్నాథ్ సింగ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం జర్మనీకి బయలుదేరారు. గత ఏడేళ్లలో ఒక భారత రక్షణ మంత్రి జర్మనీలో పర్యటించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం, పారిశ్రామిక భాగస్వామ్యాల బలోపేతం ప్రధాన ఉద్దేశం.
తమ దేశం మీదుగా ప్రయాణించే భారతీయులకు వీసా ఫ్రీ ట్రాన్సిట్ సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్టు జర్మనీ తాజాగా పేర్కొంది. జర్మనీ ఛాన్సలర్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్తో కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జర్మనీ ఈ విషయాన్ని వెల్లడించింది.
జర్మనీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. మ్యూనిచ్లోని బీఎండబ్ల్యూ ప్లాంట్ను సందర్శించారు. ఆ సంస్థ సహకారంతో తయారు చేసిన టీవీఎస్ 450సీసీ బైక్ సహా లేటెస్ట్ మోడల్ కార్లు, రోల్స్ రాయిస్, ఇటాలియన్-ప్రేరేపిత వింటేజ్ బీఎండబ్ల్యూ ఇసెట్టా, మ్యాక్సీ బైక్లను రాహుల్ పరిశీలించారు.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ డిసెంబర్ 15 నుంచి 20 వరకూ బెర్లిన్లో పర్యటించనున్నారు. మరోవైపు ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ 19తో ముగియనున్నాయి.
జర్మనీకి చెందిన ఓ నర్సు 10 మంది పేషెంట్ల ప్రాణాలు తీసింది. మరో 27 మందిని చంపడానికి ప్రయత్నించి విఫలమైంది. ఆమె ఎందుకలా చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
జర్మనీలోని ఫ్రాంక్ఫార్ట్ నగరంలో శ్రీవారి శోభ ప్రజ్వరిల్లింది. తిరుమల వైభవాన్ని ప్రతిబింబిస్తూ, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.
అమెరికా ఇటీవల H-1B వీసాలో మార్పులు లక్షలాది భారతీయ హై-స్కిల్ వర్కర్లకు ఎదురుదెబ్బలా మారాయి. ఇదే సమయంలో భారతీయ టాలెంట్ను ఆహ్వానిస్తూ యూరప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల జర్మనీ ముందుకొచ్చింది.
జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈ ఉదయం బెంగళూరు చేరుకున్నారు. రేపు కూడా వాడేఫుల్ పర్యటన భారత్ లో కొనసాగుతుంది. ఆయన భారత అంతరిక్ష పరిశోధన సంస్థను సందర్శించి, ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరుతారు.