Home » Farmers
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ సిబ్బందిపై ఆదివాసీ పోడు రైతులు ఇవాళ(శుక్రవారం) వేట కొడవళ్లతో దాడి చేశారు. కరకగూడెం మండలం అశ్వాపురపాడు గ్రామం అటవీ ప్రాంతంలో వలస ఆదివాసీ పోడు రైతులు దాడి చేశారు.
రైతుల ఆదాయం పెంచేందుకు, పంటల సాగు వ్యయం తగ్గించేందుకు గత పదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం ఎరువులపై రూ.13 లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చిందని మోదీ చెప్పారు. యూపీఏ పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు మాత్రమే సబ్సిడీగా ఇచ్చిందన్నారు.
అన్నదాతలు అందరూ ఒకేసారి పత్తిని జిన్నింగ్ మిల్స్కి తీసుకురావడంతో పంట కొనుగోలు చేయడంలో ఇబ్బంది ఏర్పడుతోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఆన్లైన్లో ముందస్తుగానే పత్తిని ఏ రోజు తీసుకువస్తారనేది రిజిస్టర్ చేసుకుంటే సమస్య ఉండదని కిషన్రెడ్డి తెలిపారు.
తంలో వ్యవసాయం అంటే మానవ జీవనానికి సాయంగా ఉండేది.. కానీ ప్రస్తుత కాలంలో వ్యవసాయంలో పెస్టిసైడ్స్ అధికంగా వాడడం వలన మనషుల జీవితాలకు హానికరంగా మారింది. దీనికి ప్రధాన కారణం.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం.. అధిక దిగుబడి కోసం రైతులు సహజ పద్దతులను పక్కకి పెట్టి ఎరువుల వాడడం.
ప్రభుత్వం ఇటీవల వ్యవసాయశాఖ పరికరాలపై జీఎస్టీ తగ్గించడంతో ప్రయోజనం చూకూరుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వరలక్ష్మి, ఏడీఏ మహుమ్మద్ఖాద్రీ, జీఎస్టీ అధికారి వెంకటరమణ అన్నారు.
అరకు కాఫీ తోటల సాగులో గిరిజన రైతులు అవిశ్రాంతంగా, అంకితభావంతో కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. అరకు కాఫీ తోటల సాగులో గిరిజన రైతులు స్థిరమైన ఆదాయాలను పొందుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో ఉల్లి (Onion) సాధారణ సాగు విస్తీర్ణం 45,278 హెక్టార్లు. ఈ ఏడాది ఈ-క్రాప్ రికార్డుల ప్రకారం 52,306 ఎకరాల (20,923 హెక్టార్లు)లో సాగు చేశారు. ఈ నెఖారుల వరకు ఈ-క్రాప్ నమోదుకు అవకాశం ఉండటంతో మరో 2-3 వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారుల అంచనా వేశారు.
సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి వ్యవసాయ అధికారుల సూచనలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అందిచే పంటను వేసి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు కేమ పొచ్చన్న. వడ్డాడికి చెందిన రైతు తనకున్న మూడెకరాల భూమిలో ఎకరంలో బంతిపూల పంటను సాగు చేసేం దుకు ముందుకొచ్చారు.
పసుపు సాగులో రైతులు కొత్తపద్ధతులు అవలంభిస్తున్నారు. పసుపుతో పాటు అంతర పంటగా బొప్పాయి సాగు చేపడుతు న్నారు. డ్రిప్ ఏర్పాటు చేసి నీటి తడులు అందించ డంతో తోటలు ఏపుగా పెరిగి కళకళలాడుతున్నాయి.
జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులను పట్టించుకోలేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రబీపంటకు పైసా కూడా బీమా ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.