Home » Election Commission of India
ఈవీఎం బ్యాలెట్ పేపర్లు మరింత సులువుగా చదివేందుకు వీలుగా ఉండేలా నిబంధనలను ఈసీఐ సవరించింది. తొలిసారి ఈవీఎంలపై గుర్తులతోపాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా ఉండబోతున్నాయి.
రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ బిహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటింటాల్సి ఉంటుందని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. బీహార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో 12వ గుర్తింపు పత్రంగా ఆధార్ను చేర్చాలంటూ సెప్టెంబర్ 8న ఎన్నికల కమిషన్కు ఇచ్చిన ఉత్తర్వులను సవరించేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ బాంబుతో ప్రధాని మోదీ ఇక దేశానికి తన ముఖాన్ని చూపించలేరని విమర్శించారు.
నిన్న ఇద్దరు పాక్ మహిళలు.. ఇప్పుడు అఫ్ఘానిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ పౌరులు బిహార్ ఓటరు జాబితాలో కనిపించారు. వెంటనే అప్రమత్తమైన ఎన్నికల..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇండియా కూటమి తరపున బీహార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు న్యాయంగా జరిగితే, రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతుందని జోస్యం చెప్పారు.
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్పై రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ ఇవాళ(సోమవారం) సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో కొత్తగా 79 పోలింగ్ స్టేషన్ల ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. గతంలో 329 ఉన్న పోలింగ్ స్టేషన్లను 408కి పెంచనున్నామని ఆర్వీ కర్ణన్ వివరించారు.
2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ ఆగస్టు 7వ తేదీన విడుదలై ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలు చివరి తేదీ ఆగస్టు 21 కాగా, పరిశీలన ఆగస్టు 22వ తేదీన ముగిసింది. మొత్తం 46 మంది అభ్యర్థులు 68 నామినేషన్ పత్రాలు దాఖలు అయ్యాయి.
ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీద పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష కూటమి యోచిస్తోంది..
రాజకీయ పార్టీలు లేవనెత్తిన కీలక ప్రశ్నలకు సీఈసీ జ్ఞానేష్ కుమార్ సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారని, ఆయన తన బాధ్యతల నుంచి పారిపోతున్నారని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఓటు హక్కు అనేది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రధానమైన హక్కు అని, దానికి పరిరక్షించేందుకు ఉద్దేశించినదే ఈసీ అని చెప్పారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్పై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై మండిపడ్డ బీజేపీ.. ప్రతిపక్షాల నుంచి ఇంతకుమించి ఏమి ఆశించగలమని కామెంట్ చేసింది.