Home » Earthquake
చైనాలోని నైరుతి ప్రాంతమైన గ్వాంగ్షీ ప్రావిన్స్లో సంభవించిన భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో నమోదైన ఈ భూప్రకంపనల కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించగా, లియుజౌ నగరం నుంచి 7,000 మందికి పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈశాన్య రాష్ట్రాల ప్రజలను భూ ప్రకంపనలు మరోసారి వణికించాయి. ఇవాళ(మంగళవారం) ఉదయం 5:59 గంటల ప్రాంతంలో మణిపూర్ సహా నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్లలో భూ ప్రకంపనలు సంభవించాయి.
జపాన్లో సోమవారం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదు అయింది.
ఆంధ్ర ఊటీ అరకు లోయతో పాటు పాడేరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. శనివారం రాత్రి 11.31 నిమిషాలకు ఈ భూ ప్రకంపనలు వచ్చాయి.
ఇండోనేషియాలోని మొలుక్కా సముద్ర తీర ప్రాంతంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4 గా నమోదైంది. సముద్ర మట్టాల్లో మార్పులు రావడంతో తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ తర్వాత ఉపసంహరించుకున్నారు.
గురువారం తెల్లవారుజామున ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో సముద్రం అడుగున భూమి కంపించింది.
ఇజ్రాయెల్, అమెరికా వైమానిక దాడులతో హడలెత్తిస్తున్న వేళ ఇరాన్ను భూకంపం కూడా వణికిస్తోంది. ఇరాన్లోని గెరాష్ ప్రాంతంలో కాసేపటి క్రితం 4.3 తీవ్రతతో భూకంపం సంభంచింది.
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్టు యూజీజీఎస్ పేర్కొంది.
పల్నాడు జిల్లా వినుకొండలో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో వినుకొండతో పాటు నడిగడ్డ పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది.
హైదరాబాద్ శివారులో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గాజులరామారంలో భారీ శబ్దంతో భూమి కంపించింది. మెట్కాన్గూడెం పరిసరాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి..