Home » Duddilla Sridhar Babu
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. మహేశ్వరం మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన సోమవారం పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతామని, శాసన సభ ప్రాంగణంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
రాష్ట్ర అసెంబ్లీ, ముఖ్యమంత్రిని కించపరిచేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో అభివృద్ధి బదలాయింపు హక్కులు(టీడీఆర్) అంశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ఆరోపణలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తీవ్రంగా స్పందించారు. బట్ట కాల్చి మీద వెయ్యడం కాదనీ, కేటీఆర్ వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.
కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
అత్యధిక మందికి ఉపాధినిచ్చే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎ్సఎంఈ) అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
ఇతర రాష్ట్రాలకు దీటుగా తెలంగాణ అన్ని రంగాల్లోనూ తన ప్రత్యేకతను చాటుతూ.. అభివృద్ధిలో దూసుకుపోతోందని మం త్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పరిశ్రమల స్థాపనలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ సత్తా ఏంటో, దానికున్న క్రేజ్ ఏంటో గత రెండు దఫాల దావోస్ సమావేశాల్లో కుదిరిన ఒప్పందాలతో, తాజాగా ముగిసిన బయోఏషియా సదస్సుతో ప్రపంచానికంతటికీ తెలిసిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
బయో ఏషియా-2025 సదస్సుకు ప్రభుత్వం ఊహించిన దాని కంటే అధిక స్పందన వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బయో ఏషియా చరిత్రలో ఈ ఏడాది సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.