Home » Duddilla Sridarbabu
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్భవన్లో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం రేవంత్రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.
శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ 71 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సుమారు 490 మీటర్ల పొడవుతో, నాలుగు లైన్లలో ఫ్లైఓవర్ను నిర్మించారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. అమెరికా ‘నేషనల్ వార్ కాలేజ్’ బృందంతో మంత్రి సమావేశమయ్యారు.
న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న పీకో టెక్నాలజీ ఇండియా హైదరాబాద్లో జీసీసీ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో పీకో టెక్నాలజీ విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్నామని పేర్కొన్నారు.
మైనింగ్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్పై ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని హరీశ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు చేస్తున్నామని, ఇందులో భాగంగానే తమ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలోనే నగరాభివృద్ధికి రూ.15వేల కోట్లకు పైగా నిధుల మంజూరుకు అనుమతులు ఇచ్చామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు.
మూసీ ప్రాజెక్ట్కు సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. పాకిస్థాన్లో బ్యాన్ చేసిన కంపెనీకి మూసీ డీపీఆర్ తయారీ బాధ్యత అప్పగించారని.. ఆ కంపెనీపై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
తెలంగాణ శాసనసభలో కేటీఆర్పై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలంటే కేటీఆర్కు చులకనన్నారు. పదేళ్ళు మంత్రిగా మహిళల కోసం కేటీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాలన్నదే తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ టార్గెట్ అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.