Home » Duddilla Sridarbabu
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు లక్షల మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని, తద్వారా 24 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ బనకచర్ల ప్రాజెక్టు కడతామని అన్నారని.. ఈ ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచర్లను సీడబ్ల్యూసీ తిరస్కరించిందని గుర్తుచేశారు. బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని ఢిల్లీలో జరిగిన సమావేశంలో తాము చెప్పామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
Minister Sridhar Babu: కేంద్ర రంగ సంస్థలకు ఇచ్చిన భూముల విషయంలో ఉపయోగంలో లేకుండా ఉండటం, పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ ఎటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
భావితరాల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ‘ఇండో-ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఇఫ్కీ)’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.
తెలంగాణకు మరో రూ.2125 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు తెలిపారు. యూఏఈకి చెందిన శైవ గ్రూప్, టారనిస్ క్యాపిటల్ కంపెనీలు సంయుక్తంగా ఈ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు.
రాష్ట్రంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 4,100 మంది ఉద్యోగాలు సాధించడంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) కీలక పాత్ర పోషించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
రైతులకు తమ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు.
కాళేశ్వరం విచారణపై మంత్రి శ్రీధర్బాబు కేసీఆర్ చట్టాన్ని గౌరవిస్తారని విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కేసీఆర్ నిజాయితీ నిరూపించకపోతే కఠిన చర్యలు తీసుకునేలా హెచ్చరించారు.
Minister Sridhar Babu: కాళేశ్వరం భూ నిర్వాసితుల పక్షాన తాము నిలబడ్డామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసు కొట్టివేయడం ఇది ప్రజల, రైతుల విజయమని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు.