Home » Duddilla Sridarbabu
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకి అరుదైన గౌరవం దక్కింది. మెల్బోర్న్లో ఆస్బయోటెక్ ఇంటర్నేషన్ కాన్ఫరెన్స్లో కీలకోపన్యాసం చేయనున్నారు మంత్రి శ్రీధర్బాబు.
మంత్రుల మధ్య వివాదాలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల మధ్య వివాదాలు లేవని స్పష్టం చేశారు. తాను సీన్సియర్ కాంగ్రెస్ వాదినని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్లు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మారు భారతీయులకు నష్టం కలిగించారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. వీసా ఛార్జీల పెంపు నిర్ణయం యువతి యువకులకు, పారిశ్రామిక వేత్తలకు ఇబ్బంది కలిగించే అంశమని చెప్పుకొచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం అద్భుత ప్రగతి సాధించిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉందని చెప్పుకొచ్చారు. జంతర్ మంతర్ వద్ద తమ నిరసన ధర్నాకు బీజేపీ ఎంపీలు ఎందుకు మద్దతు పలకలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు లక్షల మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని, తద్వారా 24 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
ఏపీ మంత్రి నారా లోకేష్ బనకచర్ల ప్రాజెక్టు కడతామని అన్నారని.. ఈ ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచర్లను సీడబ్ల్యూసీ తిరస్కరించిందని గుర్తుచేశారు. బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని ఢిల్లీలో జరిగిన సమావేశంలో తాము చెప్పామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.
Minister Sridhar Babu: కేంద్ర రంగ సంస్థలకు ఇచ్చిన భూముల విషయంలో ఉపయోగంలో లేకుండా ఉండటం, పెట్టుబడులు ఉపసంహరించుకుంటూ ఎటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు లేకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
భావితరాల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ‘ఇండో-ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఇఫ్కీ)’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు.