Home » Dubai
ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకుంటే దానిని తిరిగి పొందడం చాలా కష్టం. అదీ ఎన్నో లక్షల రూపాయల విలువైన బంగారం పోగొట్టుకుంటే ఇక దాని మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే దుబాయ్ పారిశుధ్య కార్మికుల నిజాయితీ వల్ల ఓ భారతీయ కుటుంబం దాదాపు రూ.12 లక్షలు విలువైన బంగారాన్ని తిరిగి దక్కించుకుంది.
శశిథరూర్ ప్రస్తుతం లిటరరీ ఫెస్టివల్ కోసం దుబాయ్లో ఉన్నారు. సీపీఎం నేతలను కలుకున్నట్టు వస్తున్న వార్తలపై మీడియా ఈ సందర్భంగా ఆయనను ప్రశ్నించగా ఆయన సూటి సమాధానం దాటవేశారు.
విమానం ఎక్కాలనుకున్న ఓ వృద్ధ జంట కోరిక మనవడి కారణంగా నెరవేరింది. మొదటిసారి విమానం ఎక్కిన వారి సంతోషం మాటల్లో చెప్పటం కష్టమే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దుబాయ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2025లో కరేబియన్ వీరుడి రోవ్మన్ పావెల్ విధ్వంసం సృష్టించాడు. దుబాయ్ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడిన పావెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి.. శతకానికి చేరువయ్యాడు. ఓవర్లు పూర్తి కావడంతో తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు
సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యానగర్లోని నసీరుద్దీన్ కుటుంబ సభ్యులను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ తదితరులు పరామర్శించారు.
ఉమ్రాయాత్ర ప్రమాదం నగరాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సోమవారం తెల్లారేసరికి ప్రమాద వార్త విని నగరవాసులు ఉలిక్కిపడ్డారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో నగరానికి చెందిన 45 మంది మరణించడంతో సిటీ జనులు దిగ్బ్రాంతి కి గురయ్యారు.
బీఆ (BEEAH) ఫెసిలిటీ, టెక్టాన్ (tecton) ఇంజనీరింగ్, అరబ్ - ఇండియా స్పీసెస్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశంకానున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, రికవరీ ప్లాంట్లు, వైద్య రంగంలో బీఆ (BEEAH)ఫెసిలిటీ సంస్థ ప్రపంచ ప్రసిద్ధి పొందింది.
చేతిలో యాభై రూపాయలుంటే సాధారణ హోటల్లో కాఫీ తాగొచ్చు. పర్సులో ఐదొందలుంటే స్టార్బక్స్లో కాఫీ రుచి చూడొచ్చు. అయితే దుబాయ్లోని ఒక కేఫ్లో కప్పు కాఫీ తాగాలంటే... అరలక్షకు పైగా చెల్లించాల్సిందే. ఎందుకంటే... ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ అదే మరి.
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన 3 రోజుల యూఏఈ పర్యటన ముగిసింది. శనివారం ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక 3 రోజుల పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో 25 కీలక సమావేశాల్లో చంద్రబాబు బృందం పాల్గొంది.
ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థుల కోసం ఈ పథకం తీసుకొచ్చింది రాష్ట్ర సర్కార్. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.