Home » DMK
తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను ముఖ్యమంత్రి స్టాలిన్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంపిక చేస్తారని డీఎంకే ప్రిసీడియం కార్యదర్శి ఆర్ఎస్ భారతి పేర్కొన్నారు.
తన బొందిలో ప్రాణమున్నంతవరకూ రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉంటానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి దివంగత నేత కరుణానిధిని ఆదర్శంగా తీసుకుని శ్రమించడమే కాకుండా, అందరికీ అన్ని సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా నిర్విరామంగా కృషి చేస్తానన్నారు.
అన్నాడీఎంకే కార్యాలయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఢిల్లీకి మార్చారంటూ ఎద్దేవా చేసిన డీఎంకే లోక్సభ సభ్యురాలు కనిమొళికి ఆయన కౌంటర్ ఇచ్చారు.
వారానికి నాలుగురోజుల పాటు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో బసచేసి, అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అన్నా అరివాలయంలో మంగళవారం డీఎంకేకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం స్టాలిన్న జరిగింది.
రాష్ట్రంలో అధికార భాగస్వామ్యం పొందాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఎప్పుడూ చెప్పలేదని టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై పేర్కొన్నారు. బుధవారం పెరియార్ జయంతి సందర్భంగా నగరంలోని సిమ్సన్ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
తన పర్యటనలకు జనం అధిక సంఖ్యలో రావాలనే ఆలోచనతోనే తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ వారంతపు సెలవుదినాల్లో ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి విమర్శించారు.
కొత్తగా రాజకీయాల్లోకి ఎవరొచ్చినా ప్రజలకు తాము చేయబోయే సత్కార్యాలను గురించి చెప్పకుండా డీఎంకేని అదే పనిగా తిట్టడమే ఆనవాయితీగా మారిందని ఎంపీ కనిమొళి ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి సందర్భంగా కన్నియాకుమారి రౌండ్ఠాణా జంక్షన్ వద్దనున్న విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.
స్టాలిన్ అంటేనే ‘మేన్ ఆఫ్ స్టీల్’ అనేలా తాను తీసుకునే నిర్ణయాలన్నీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే విధంగానే ఉంటాయని, అంతే కాకుండా కార్యసాధనలో తనకు పట్టుదల ఎక్కువేనని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకూ ‘విశ్రాంతి’ అనే మాట మరిచి, పార్టీ కోసం ముమ్మరంగా ప్రచారం చేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని జిల్లా కార్యదర్శులకు డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు.
అంబులెన్స్లు వెళ్లే ప్రధాన రహదారులను ఆక్రమించి రోడ్షోలు చేస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)కి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే ఆ పార్టీ ఐసీయూలో చేరటం ఖాయమని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Udayanidhi) జోస్యం చెప్పారు. సైదాపేటలో రూ.28.75 కోట్లతో నిర్మించిన ఆరంతస్థుల ఆస్పత్రిని సోమవారం ఆయన ప్రారంభించారు.