Home » DK Shivakumar
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కర్ణాటక అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో కాంగ్రెస్ లిజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న డీకే శివకుమార్ తన క్యాబినెట్లో నలుగురు ఉప ముఖ్యమంత్రుల ప్రతిపాదనతో విభేదించినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తన నిర్ణయాన్ని ఆయన కేంద్ర అధిష్ఠానానికి తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్గా, విశ్వసనీయుడిగా, 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ పదవి ఆయనను అంత తేలిగ్గా వరించలేదని డీకే జ్యోతిష్యుడు బెల్లూర్ ద్వారకానాథ్ తెలిపారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనుండటం ఖాయమైంది. నాయకత్వ మార్పు నేపథ్యంలో తన కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సిద్ధరామయ్య కోరినట్టు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం.
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా నిజానికి అంత నిశ్శబ్దంగా సాగ లేదు. తాను కుర్చీ ఖాళీ చేస్తూ.. తన తదుపరి వారసుడు డీకే శివకుమార్కు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒక పవర్ ఫుల్ 'పొలిటికల్ టైమ్ బాంబ్'ను బహుమతిగా ఇచ్చి వెళ్లారు.
కర్ణాటక ఎన్నికల చరిత్రలో గత 40 ఏళ్లుగా ఏ అధికార పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. కర్ణాటక కొత్త సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టబోతోన్న డీకే శివకుమార్ చేతిలో కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది.
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్ఠానం చురుగ్గా పావులు కదుపుతోంది. మే 30వ తేదీ శనివారంనాడు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల తాజా సమాచారం. కొత్త మంత్రివర్గంలో ముగ్గురు ఉపముఖ్యమంత్రులకు చోటు కల్పిస్తారని తెలుస్తోంది.
కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఎటూ తేల్చలేకపోయింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు రాజ్యసభ సీటు, ఆయన కుమారుడికి...
కర్ణాటకలో అధికార మార్పిడికి సంబంధించిన అంశంపై పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఎలాంటి చర్చా జరగలేదని, త్వరలో జరుగనున్న కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే చర్చ జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు.
కర్ణాటకలో నాయకత్వ మార్పు అవకాశాలపై ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన డిప్యూటీ డీకే శివకుమార్ ఢిల్లీ చేరుకున్నారు. పార్టీ అధిష్ఠానం సైతం నాయకత్వ మార్పుపై ఇంతవరకూ పెదవి విప్పనప్పటికీ దీనిపై చర్చించేందుకు సీనియర్ నేతలిద్దరినీ ఢిల్లీకి రావాల్సిందిగా పిలిచింది.