Home » Delhi
దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు ఈరోజు(గురువారం) బిగ్ డేగా నిలవనుంది. కొత్త పార్లమెంట్ భవన సామర్థ్యానికి అనుగుణంగా ఎంపీల సంఖ్య పెంపుదల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈరోజు(గురువారం) ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభల్లో మహిళా బిల్లు, డీలిమిటేషన్పై ప్రధానంగా చర్చ జరగనుంది.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను సాధ్యమైనంత వేగంగా అమలు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.
మహిళా రిజర్వేషన్లపై కేంద్రం తీరును రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణ కేవలం అధికారం కోసమేనని అన్నారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
పార్లమెంట్లో మహిళా బిల్లుపై చర్చను వీక్షించేందుకు ఏపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
నోయిడాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడిన 300 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. మరో 100 మందికి పైగా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. వేతనాల పెంపు, 8 గంటల పని కోసం నిన్న(సోమవారం) కార్మికులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది.
నోయిడాలో జీతాలు పెంచాలని కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. వేతనాలు పెంచాలని నోయిడా పారిశ్రామికవాడలో మూడ్రోజులుగా నిరసన చేస్తున్న కార్మికులంతా నేడు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. పలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.
ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, దీనిని ఒక చారిత్రాత్మక విజయంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ భారీ కార్యాచరణను సిద్ధం చేసింది.
జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు జడ్జి పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు.