Home » Delhi
బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందని పేర్కొన్నారు.
లోక్సభలో మహిళా బిల్లు వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పుచేశాయని కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆయన అన్నారు.
డీలిమిటేషన్ వెనుక బీజేపీ కుట్ర దాగుందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. విపక్షాలు ఐక్యంగా పోరాడి బీజేపీని అడ్డుకున్నాయని ఆమె తెలిపారు.
131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించినందుకు ప్రియాంకకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక ఉన్న అసలు విషయాలను ప్రియాంక బయటపెట్టారని ముఖ్యమంత్రి అన్నారు.
తెలుగు రాష్ట్రాల నేతలకు ఆంధ్ర నుంచి కేంద్రమంత్రిగా ఆతిథ్యం ఇచ్చానని.. ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటులో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అంశంపై ఆయన ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యవహారం చర్చనీయాంశమైంది.
వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ వేసిన పిటిషన్పై జస్టిస్ తుషార్ రావు శుక్రవారం విచారణ జరిపారు.
తెలంగాణ రాష్ట విభజన సమయంలో కాంగ్రెస్ తప్పిదాలతో యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఎంపీ తేజస్వి సూర్య చెప్పారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. 2009లో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు సహకరించి మళ్లీ వెన్నక్కి తగ్గారని.. దీని గురించే తేజస్వి సూర్య మాట్లాడారని అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని స్వరూప్ నగర్లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కుటుంబ వివాదం నేపథ్యంలో ఓ ఇంట్లో మంటలు ఎగసిపడ్డాయి. ఓ వ్యక్తి ఆ మంటల్లో చిక్కుకుపోయాడు.
పార్లమెంట్ ఉభయసభల్లో మహిళా బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి చెందిన కూటమి మహిళా నేతలు ఢిల్లీకి వెళ్లారు.