Home » Dasara
గ్రేటర్లోని వివిధ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు దసరా పండగ సెలవుల సందర్భంగా స్వస్థలాలకు వెళ్లేందుకు టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుందని గ్రేటర్ ఈడీ ఎం. రాజశేఖర్ తెలిపారు.
ఆయుధపూజ, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06012 నాగర్కోయిల్-తాంబరం ప్రత్యేక వారాంతపు సూపర్ ఫాస్ట్ రైలు ఈ నెల 28, అక్టోబరు 5,12,19,26 తేదీల్లో (ఆదివారం) నాగర్కోయిల్లో రాత్రి 11.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది.
బాను ముస్తాక్ కొన్ని నెలల క్రితం హిందూ వ్యతిరేక, కన్నడ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని పిటిషనర్లు వాదించారు. దసరా ప్రారంభోత్సవంలో చాముండేశ్వరి దేవత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని, వేదాలను పఠించాలని తెలిపారు.
తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా బాసిల్లుతూ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సాంస్కృతిక పర్వం బతుకమ్మ. ఆ బతుకమ్మ పర్వానికి కచ్చితంగా తొమ్మిది రోజుల ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమయ్యే వేడుకే బొడ్డెమ్మల పర్వం.
దసరా, దీపావళి సందర్భంగా కొన్ని మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్లను అక్టోబరు నుంచి నవంబరు వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రయాణికుల రద్దీ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-తిరుపతి (07011) ప్రత్యేక వీక్లీ రైలు సెప్టెంబరు 5 నుంచి 26 వరకూ శుక్రవారాలలో, దీని తిరుగు ప్రయాణపు రైలు (07012) సెప్టెంబరు 6 నుంచి 27 వరకూ శనివారాలలో నడపనున్నట్లు తెలియజేశారు.
మైసూరు దసరా ఉత్సవాలు దేశంలోనే ఎక్కడాజరగని రీతిలో నిర్వహిస్తారు. అందుకు ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయి. ఏటా ఓ సాహితీవేత్త లేదా ప్రముఖుల ద్వారా ఉత్సవాలను ప్రారంభించే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది దసరా ఉత్సవాలను ప్రముఖ రచయిత్రి, బుకర్ప్రైజ్ విజేత బానుముస్తాక్ ప్రారంభించనున్నారు.
గత రెండు మూడేళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రూ.500 దర్శనాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్న యోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. శరన్నవరాత్రుల్లో అంతరాలయం దర్శనం ఉండదు.
దేశప్రజలు అక్టోబరు 1,2 తేదీల్లో ఆయుధ పూజ, విజయదశమి పండుగలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల సౌకార్యర్ధం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ముందుస్తు రిజర్వేషన్ శనివారం నుంచి ప్రారంభమైంది. ప్రజల సౌకర్యార్ధం ప్రయాణానికి 60 రోజులు ముందుగా రైలు టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.
దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకి. అలాంటి పండగ వేళ.. అమ్మవారిని పూజిస్తే చాలు సకల సంపదలు ఇస్తుంది. అమ్మవారు అష్టలక్ష్ముల రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపాల్లో అమ్మవారిని దీపావళి వేళ పూజిస్తే మాత్రం అదృష్టం తలుపుతట్టినట్లేనని శాస్త్ర పండితులు చెబుతున్నారు.