Home » Cyberabad Police
సోషల్ మీడియాలో లక్కీ డ్రాల పేరుతో జరుగుతున్న మోసాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. పాపులారిటీ ఉన్న ఇన్ఫ్లూయెన్సర్లు అయినాసరే చట్టానికి అతీతులు కాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు కొత్త వెబ్సైట్ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి పెరిగిన నేపధ్యంలో.. పోలీస్ కమిషనరేట్కు కూడా కొత్తగా రూపొందించారు. 5 జోన్లు, 44 పోలీస్ స్టేషన్లతో ఉన్న కమిషనరేట్ను ప్రస్తుతం 3 జోన్లు, 7 ఏసీపీ డివిజన్లు, 23 శాంతిభద్రతల పోలీస్ స్టేషన్ల పరిధులతో పునర్విభజన చేశారు.
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చేసిన ఫిర్యాదు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, పరువు నష్టం కలిగించే పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు.
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కేసుపై నాంపల్లి కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నిందితుడు రవిని మూడోసారి కస్టడీకి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే మరో నాలుగు కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన రెండు వెబ్ సైట్లు హ్యాక్కు గురయ్యాయి. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో వారం రోజులుగా వెబ్ సైట్లు పని చేయని పరిస్థితి.
న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, పర్మిషన్ ఉండాల్సిందే అంటున్నారు పోలీసులు.
సైబర్ మోసాల కేసుల్లో కీలక పాత్రధారులు తప్పించుకుంటున్నారు. నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను ఇచ్చిన వారిని మాత్రమే పోలీసులు అరెస్టు చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో సైబర్ క్రైం విభాగం దర్యాప్తు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డిజిటల్ అరెస్టు పేరుతో పలువురిని సైబర్ క్రిమినల్స్ మోసగిస్తున్నారు. సైబర్ నేరస్తుల బారిన పడి బాధితులు పెద్దమొత్తంలో నష్టపోతున్నారు. తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్యని డిజిటల్ అరెస్ట్ పేరిట చీటింగ్కు పాల్పడ్డారు సైబర్ క్రిమినల్స్.
డిజిటల్ అరెస్ట్పై ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. తమ కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్కు గురయ్యారని పేర్కొన్నారు. పోలీసులను ఆశ్రయిస్తే సమస్యను పరిష్కరించారని గుర్తుచేశారు.
హైదరాబాద్లో సైబర్ అవేర్నెస్ ఉన్నప్పటికీ, ఇంకా బాధితులు ఉన్నారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సైబర్ బాధితులు తగ్గేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి.