Home » Court
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ షేర్ల బదిలీపై చెన్నైలోని NCLT అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తమ షేర్ల బదిలీపై ఇచ్చిన తీర్పును చెన్నై లోని అప్పీలేట్ ట్రిబ్యునల్లో జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల సవాల్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులు ఉన్నారు. వీరి బెయిల్ పిటిషన్పై బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగనుంది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ కీలక నేత నారాయణ స్వామి మొబైల్ను FSLకి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో నిందితులను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు సిట్ అధికారులు. ఈ క్రమంలో లిక్కర్ స్కాం కేసుపై విచారణ చేపట్టింది న్యాయస్థానం.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. ఈ పిటీషన్పై మరికాసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-30 పైలా దిలీప్కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పైలా దిలీప్కు బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు షరతులు విధించింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు బుధవారం రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు రాజమండ్రి పోలీసులు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో మిథున్రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ నటులు నాగచైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆరే కారణం అంటూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది.
అత్యాచారం కేసులో బాధితురాలిగా చెబుతున్న మహిళ ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధంగా లేనప్పటికీ పోలీసులు బలవంతంగా ఆమె చేత ఫిర్యాదు చేయించారని ప్రజ్వల్ రేవణ్ణ తెలిపారు. తాను విద్యాధికుడనని, తనపై తప్పుడు కేసు బనాయించారని, తాను ఎంపీగా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా అత్యాచారం ఫిర్యాదులు చేయలేదని అన్నారు.
నాంపల్లి కోర్టు కేసుపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కేసుకు సంబంధించి గౌరవ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని ముందుకెళ్లాలని స్పష్టం చేసిందని అన్నారు. తనకు ఈ దేశ న్యాయవ్యవస్థ మీద అపారమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.