Home » Congress
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల (TS Lok Sabha Polls) ముందు దారుణ ఘటన జరిగింది. హైదరాబాద్లోని (Hyderabad) రాజేంద్రనగర్లో కాంగ్రెస్ నేతను ఓ దుండగుడు అతి దారుణంగా హత్య చేసి చంపాడు.
ఫ్రీ బస్సు పథకం సంతోషమే కానీ.. దాని వల్ల ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మంచిర్యాల రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..
మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి(Congress Party) పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) ప్రజలు బుద్ది చెప్పాలని బీఆర్ఎస్(BRS) పార్టీ నాయకులు హరీష్ రావు(Harish Rao) అన్నారు. శనివారం నాడు సిద్దిపేట జిల్లా(Siddipet) అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో వెంకట్రామిరెడ్డికి(Venkata Ram Reddy) మద్ధతుగా ప్రచారం నిర్వహించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై(YS Jagan) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే తనకు భయంగా ఉందని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. జగన్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘జగన్ మానసిక పరిస్థితి గురించి నాకు భయంగా ఉంది. అద్దం(Mirror) పంపిస్తున్నా..
Telangana: కేవలం కుటుంబ సభ్యుల బాగు కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకునేది బీజేపీ మాత్రమే అని మాజీ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ అన్నారు. శనివారం సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధావుల సదస్సుకు తమిళ సై హాజరై ప్రసంగించారు.
ఒడిశాలోని పూరీ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సుచరిత మొహంతీ పోటీకి నిరాకరించారు. పార్టీ టిక్కెట్ తిరిగి ఇచ్చేశారు. ప్రచారానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు పార్టీ నిరాకరించడమే ఇందుకు కారణం.
Telangana: ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో మార్పు మొదలైంది. రేవంత్ పాలనలో పంట పెట్టుబడి సహాయం అందలేదు మార్పు మొదలైంది. అనేక పట్టణాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్ సరఫరాలో కోతతో మార్పు మొదలైంది. పంటలు ఎండటంలో మార్పు. అక్రమ కేసులు పెట్టడంలో, జైళ్లు నింపడంలో మార్పు మొదలైంది’’ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పర ఆరోపణలతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) మే 4న జార్ఖండ్ పాలములోని ఎన్నికల ర్యాలీలో(Lok Sabha Polls 2024) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్, జేఎంఎం నేతలపై మోదీ విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీ చేస్తే సరదాగా ఉండేదని బీజేపీ గోరఖ్ పూర్ సిట్టింగ్ ఎంపీ, నటుడు రవి కిషన్ అభిప్రాయ పడ్డారు. గత రాత్రి వరకు ఉత్కంఠతో ఎదురు చూశా.. ఆట మొదలు కాకముందే ముగిసింది. ఒకవేళ అమేథిలో స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీ చేసి ఉంటే సరదాగా ఉండేదని సెటైర్లు వేశారు.
Andhrapradesh: మద్యం నిషేధంపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై కడప ఎంపీ అభ్యర్థి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ప్రశ్నలు సంధించారు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం హామీలు నెరవెరుస్తామని.. పూర్తి మద్య నిషేధం తర్వాతే 2024 ఎలక్షన్లో ఓట్లు అడుగుతానంటూ 2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్ షర్మిల మరోసారి ప్రశ్నలు సంధించారు.