Home » Congress
సీఎం పోస్టుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తుండగా, డీకే మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుందన కర్ణాటక రైతుల సమస్యలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్తానని చెప్పారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తాము తెచ్చిన ఇండస్ట్రీయల్ పాలసీ అర్థం కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఇండస్ట్రీలను ORR బయటకు పంపాలనే డిమాండ్ ఉందని గుర్తుచేశారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అధికార కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని కసరత్తు చేస్తోంది. ప్రజాపాలన ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీకి కలిసివస్తాయని నేతలు చెబుతున్నారు.
పార్టీ మౌలిక సిద్ధాంతాలు, ప్రవర్తనా నియమావాళికి భిన్నంగా ఈ నేతలు పార్టీ వెలుపల వేదికలపై తప్పుదారి పట్టించే ప్రకటనలు చేశారని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బీపీసీసీ పేర్కొంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 20వ తేదీతో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. 2023లో కుదిరినట్టు చెబుతున్న ఒక ఒప్పందం ప్రకారం తక్కిన రెండున్నరేళ్ల పాలన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ 'మహా ర్యాలీ' వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి (కేసీ వేణుగోపాల్) వివరిస్తూ, డిసెంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు.
డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారని జరుగుతున్న ప్రచారంపై ఓ క్లారిటీ వచ్చింది. తాను రాజీనామా చేయబోతున్నది పీసీసీ చీఫ్ పదవికి మాత్రమేనని, పార్టీకి కాదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
బిహార్ తరహాలో కాకుండా ఈసారి ముసాయిదా జాబితాలో ఎలాంటి అవకతవకలు కనిపించినా లీగల్ టీమ్ల సాయంతో అభ్యంతరాలు తెలియజేయాలని, ఫైనల్ లిస్ట్ తర్వాత కూడా అప్పీల్స్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులు సూచించారు.
కర్మ హిట్స్ బ్యాక్ అంటూ ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. జై తెలంగాణ అంటూ కవిత సమాధానమిచ్చారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో ప్రజలు చెప్పిన వాటి ఆధారంగానే తాను ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు.
అమెరికాలో బాత్రూంలు కడిగి వచ్చినోనికి హైదరాబాద్లో రౌడీలకు, పహిల్వాన్లకు తేడా తెల్వదని నవీన్యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ విమర్శించారు. కుమారుడి గెలుపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.