Home » Congress Govt
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు అడగటానికి కాంగ్రెస్ నేతలు వస్తే బాకీ కార్డు చూపెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అవ్వా , తాతలకు రూ.4000 పెన్షన్ ఇస్తామని అన్నారని.. ఇచ్చారా? అంటూ నిలదీశారు. మహిళలకు రూ.2500 ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో 14వేల అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల నియామకాన్ని చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా శిశు సంక్షేమాన్ని తమ ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకుందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
ఫీజు బకాయిలపై తెలంగాణ బీజేపీ నేతలు పోరుబాటకి సిద్ధమయ్యారు. లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలతో కలిసి నవంబర్ తొలి వారంలో ‘చలో హైదరాబాద్’ చేపట్టడానికి కార్యచరణ రూపొందిస్తున్నట్లు బీజేపీ నేతలు పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాయమయ్యాయని మండిపడ్డారు.
సత్తుపల్లిలో బీసీ బంద్లో భాగంగా బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటూనే మరోపక్క ర్యాలీకి ఎలా వస్తారంటూ బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
బీసీ ర్యాలీలో ర్యాలీలో వి.హనుమంతరావు ఫ్లెక్సీ పట్టుకుని నడుస్తుండగా.. అది అడ్డువచ్చి కిందపడిపోయారు. వెంటనే స్పందించిన కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావును పైకి లేపారు.
అందరికీ విద్యా, ఉద్యోగం కల్పించాలని గొప్ప సామాజిక విప్లవం కోసం రాహుల్ గాంధీ మేనిఫెస్టో రూపొందించారని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. కొద్ది తేడాతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేక పోయిందని అసహనం వ్యక్తం చేశారు.
సిద్దిపేటలో బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు పార్టీ కండువాలతో నిరసనలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. ఈ మేరకు జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీల బంద్కు మద్దతు తెలుపుతూ.. ఆటోలతో ర్యాలీ చేశారు.
తెలంగాణలో మద్యం టెండర్లకు అనూహ్యంగా స్పందన తగ్గింది. ఈసారి మద్యం దుకాణాలకు ఆశించినస్థాయిలో దరఖాస్తులు రావడం లేదని అధికారులు వాపోతున్నారు. దరఖాస్తుల గడువు ముగింపు దశకు వచ్చిన ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.