Home » Congress Govt
కామారెడ్డిలో వరద నష్టం అంచనాపై రీ సర్వే చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ సూచించారు. కామారెడ్డిలో వరద నష్టానికి ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ఎంపీ ధర్మపూరి అర్వింద్ ప్రశ్నించారు.
భూ భారతిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ ఓ ముఠా రైతులను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు ఇచ్చి పట్టాదారు పుస్తకం కోసం వెళ్లగా.. నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు ఇచ్చేవారని పేర్కొన్నారు.
సింగరేణి నుంచి వచ్చిన రూ. 2360 కోట్ల లాభంలో 34 శాతం సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పంచానుంది. దసరా కానుకతో పాటు మరో కానుకను కూడా ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రేవంత్రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూలగొట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వరద ముంపు బాధితులను రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని మండిపడ్డారు. తలసాని తనవంతు సహాయంగా బస్తీ వాసులను ఆదుకుంటున్నారని తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీ బీజేపీ చీఫ్ రామచందర్ రావు సెటైర్లు గుప్పించారు. 50 సార్లు ఢిల్లీ వెళ్లినందుకు రేవంత్రెడ్డికి ఆఫ్ సెంచరీ సెలబ్రేట్ చేయాలని ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డికి కిషన్రెడ్డి ఫోబియా పట్టుకుందని రామచందర్ రావు విమర్శించారు.
షాడో సీఎం ఆరోపణలపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. షాడో సీఎం ఎవరో ఆ వ్యక్తి పేరు, చేసిన పని ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎన్నో చూశానని సీఎం రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు.
బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్కు సుప్రీంకోర్టు ఇచ్చిన 90 రోజుల గడువుపై ఉన్నత న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు బీసీ రిజర్వేషన్ విషయంలో వేచి చూస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
గిన్నిస్ బుక్ రికార్డులో చేరే విధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొత్తగా కవులు, రచయితలను పిలిచి వారితో చర్చించి బతుకమ్మ పాటలు పాడేలా ప్లాన్ చేస్తామని పేర్కొన్నారు.
రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్పై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు మారుస్తోందని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.