Home » CJP
తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఓ విద్యార్థికి నోటీసు జారీ చేయడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై సంబంధిత మేజిస్ట్రేట్ నుంచి వివరణ కోరనున్నట్లు స్పష్టం చేసింది.
సీజేపీ నిరసనకారులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జులైలో చేపట్టిన ఉద్యమంలో ఎంతటి హింస జరిగిందో తెలిసిందే. అయితే.. ఓ నిరసనకారురాలి తండ్రిపై దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు ఓ ఇన్ఫ్లుయెన్సర్ను అరెస్ట్ చేశారు. అనంతరం కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు.
జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనల క్రమంలో విద్యార్థులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో సెప్టెంబర్ 5న ఢిల్లీలో తలపెట్టిన భారీ మార్చ్ను ఉపసంహరించుకుంటున్నట్లు సీజేపీ ప్రకటించింది.
నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ 4 రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనల్లో పోలీసులు బలప్రయోగంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ కూర్పుపై వివాదం నెలకొంది. జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీని పునర్వ్యవస్థీకరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
నీట్ పేపర్ లీక్కు నిరసనగా సంసద్ ఛలో కార్యక్రమంతో యావత్ దేశంలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ దేశరాజధానిలో మరో నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది.
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కన్వీనర్ అభిజీత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రాథమిక సౌకర్యాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో దేశాభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
‘చలో పార్లమెంట్’ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్మల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది.
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు, సీఎం హేమంత్ సోరెన్తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
హైదరాబాద్లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ విద్యార్థులకు సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.