Home » Chennai
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారమే లక్ష్యంగా అధికార డీఎంకే చెన్నై నగరవాసులపై వరాల జల్లులు కురిపించింది. ప్రపంచ స్థాయి సిటీగా చెన్నైను తీర్చిదిద్దుతామని, రూ.10,000 టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రముఖ నటి త్రిష కృష్ణన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు పంపిన ఈమెయిల్ పోలీసులను అప్రమత్తం చేసింది.
ఇండియన్ సూపర్ స్టార్స్ రజినీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రజినీకాంత్, ధనుష్ ఇళ్ల దగ్గర సోదాలు నిర్వహిస్తున్నారు.
TVK పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్పై చెన్నైలోని పెరవల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్తో పాటు సుమారు 5 వేల మంది పార్టీ కార్యకర్తలపైనా కేసులు పెట్టారు. అనుమతికి మించి లౌడ్స్పీకర్లు, అంబులెన్స్కు ఆటంకం కల్పించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది.
గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా పెద్ద సంఖ్యలో హోటళ్లు మూతపడుతున్నాయి. సేవలు కొనసాగిస్తున్న కొన్ని హోటళ్లు సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఆహార పదార్థాలతో పాటు గ్యాస్కు కూడా అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.
ఓ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన కాసేపటికి వైద్యురాలు ఆ బిడ్డను తీసుకుని బయటికి వచ్చింది. బయటే ఆసక్తిగా ఎదురుచూస్తున్న తండ్రి చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే మొదటిసారి తండ్రి అయిన ఆ వ్యక్తి.. తన బిడ్డను చూడగానే..
తమిళనాడులో డీఎంకే పాలన అవినీతిమయం అయిపోయిందని, రాష్ట్రంలో మాదకద్రవ్యాల మాఫియా చెలరేగిపోతోందని ప్రధాని మోదీ ఆరోపించారు.
చెన్నైలోని ప్యారిస్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణంలో పని చేస్తున్న మహిళ కోసం ఓ వ్యక్తి పార్శిల్ తీసుకొచ్చాడు. సెక్యూరిటీ గార్డుకు ఆ పార్శిల్ ఇచ్చి ఆమెకు ఇవ్వాలని చెప్పి వెళ్లిపోయాడు. ఆ పార్శిల్ ఓపెన్ చేసి చూసి అందరూ నివ్వెరపోయారు.
దళపతి విజయ్కి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. విజయ్ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. విజయ్ వేసిన రిట్ పిటిషన్పై జస్టిస్ సెంథిల్ కుమార్ శుక్రవారం విచారణ జరిపారు. ఆదాయ పన్ను శాఖకు అనుకూలంగా తీర్పునిచ్చారు.
దివంగత సీఎం జయలలిత పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను కట్టాల్సి ఉండటంతో.. ఆ శాఖ అధికారులు వేద నిలయాన్ని వేలం వేయాలని చూస్తున్నారు. జయలలితకు సంబంధించి ఆదాయ, ఆస్తి పన్నులు రూ.13.69 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి..