Home » Chennai
తమిళిసై ఇవాళ తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.
ఫ్లైయింగ్ ట్యాక్సీని ఐఐటీ మద్రాస్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి రూపొందించారు. ఆ ట్యాక్సీకి e200 అని పేరు కూడా పెట్టారు. తన ఫ్లైయింగ్ ట్యాక్సీకి సంబంధించిన వివరాలను సత్య చక్రవర్తి మీడియాకు వెల్లడించారు. e200 ట్యాక్సీ రూపకల్పన, భద్రత ప్రమాణాలు, నియంత్రణ, పట్టణ రవాణాపై ప్రభావం లాంటి అంశాలను వివరించారు.
తిరుపతి సెక్షన్లో చేపడుతున్న మరమ్మతుల కారణంగా తిరుపతికి వెళ్లే పలు ఎక్స్ప్రెస్లు రద్దు చేయగా, మరికొన్ని పాక్షికంగా, మరికొన్నింటిని ఇతర మార్గాల్లో నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే పేర్కొంది.
చెన్నై - బెంగుళూరు వందేభారత్ రైలు(Vande Bharat train)ను ఈనెల 12వ తేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభించనున్నారు.
తమిళనాడుకు చెందిన బీజేపీ కార్యకర్త అశ్వంత్కు కవల పిల్లలు జన్మించారు. వారిని చూడకుండా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు చెన్నై ఎయిర్ పోర్టుకు వెళ్లారు. ఆ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యారు. అశ్వంత్, అతని కుటుంబానికి ప్రధాని మోదీ ఆశీస్సులు అందజేశారు.
ప్రజా సంక్షేమం కోసం ఉద్దేశించిన ధనాన్ని అధికార డీఎంకే లూటీ చేస్తే చూస్తూ ఊరుకోమని, దానిని బీజేపీ కక్కించి ప్రజల కోసం వెచ్చిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడు అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.
తమిళనాడు రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు అన్నామలై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని అయితే పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని వెల్లడించారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో విడుదలైన దోషి సంతాన్ తాజాగా మరణించారు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సంతాన్ తుదిశ్వాస విడిచారు.
స్థానిక తిరుమంగళం ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలో చెత్తకుండీలో పడేసిన మనిషి ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మూడు రోజుల క్రితం రామేశ్వరం సమీపం మండపం వద్ద మన్నార్ జలసంధికి చేరువగా వేదాలై అనే ప్రాంతం వద్ద నాటుపడవలో ప్రయాణించిన స్మగర్లు సముద్రంలో విసిరేసిన పది కేజీల బంగారం కోసం కోస్ట్గార్డ్(Coast Guard) అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు.