Home » Chennai News
కరూర్లో టీవీకే అధినేత విజయ్ ప్రచారం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని, విద్యుత్ సరఫరాను నిలిపేశారని, ఉద్దేశపూర్వకంగా ప్రచారమార్గంలో అంబులెన్సులను నడిపారంటూ వస్తున్న విమర్శలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు సమాధానం చెప్పారు.
ఇటీవల ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ కరూర్ పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన వ్యవహారం రాష్ట్రంలో ఇంకా నిప్పు రాజేస్తూనే వుంది. ఈ దుర్ఘటన ద్వారా లబ్ధి పొందేందుకు అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతుండడంతో మరిన్ని కొత్త వివాదాలకు కారణమవుతోంది.
కరూర్ దుర్ఘటనలో అన్నివైపులా తప్పులు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు.శనివారం సాయం త్రం కరూర్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పర్యటనలో ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు.
అన్ని పార్టీలతోనూ డీఎండీకే స్నేహపూర్వకంగానే మెలగుతోందని, అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తుపై చర్చించేందుకు ఇప్పటి వరకు ఏ కూటమి నుంచి కూడా తమకు ఆహ్వానం అందలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత అన్నారు.
నాటు తుపాకీతో కోడిని కాల్చుతున్న సమయంలో, గుండు గురితప్పి యువకుడికి తగలగా అతను ఘటనా స్థలంలోనే మృతిచెందారు. కళ్లకుర్చి జిల్లా కల్వరాయన్ కొండ ప్రాంతాలోని మేల్మదూర్ గ్రామానికి చెందిన అన్నామలై, తన అల్లుడికి కోడి కూర చేయాలని, దానికోసం తాను సంరక్షిస్తున్న కోళ్లను పట్టుకునేందుకు యత్నించగా, అవి చిక్కలేదు..
వరుసగా వివాహేతర సంబంధాలతో తనకు చెడ్డపేరు తీసుకొస్తోందని ఆగ్రహించిన ఓ తండ్రి తన కుమార్తెను హతమార్చిన ఘటన తేని జిల్లాలో చోటుచేసుకుంది. మార్కండయన్కోట ప్రాంతానికి చెందిన ప్రవీణ విభేదాల కారణంగా భర్తను వదిలి పదేళ్లుగా మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం, ప్రతిపక్షనేత ఈపీఎస్ ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో చేపట్టిన ప్రచారయాత్ర శుక్రవారం కరూర్ జిల్లాలోని అరవకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగింది.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత విజయ్(Vijay)కి రాజకీయాలంటే ఏమిటో తెలియవని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని హాస్యనటుడు ఎస్వీ శేఖర్ అన్నారు. శుక్రవారం ఉదయం సచివాలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ మందవెళిపాక్కంలోని ఐదో క్రాస్ రోడ్డుకు రంగస్థల నటుడైన తన తండ్రి వెంకట్రామన్ పేరు పెట్టినందుకు ఈ సందర్భంగా సీఎం స్టాలిన్కు ధన్యవాదాలు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పఇన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుండడంతో రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో గంటకు 50 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అప్రమత్తమైన తూత్తుకుడి జిల్లా జాలర్లు సముద్రంలో చేపలవేటకు వెళ్లకుండా ఆగిపోయారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు తమిళనాడు రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం పలు నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్ప్రెస్ రవాణా సంస్థ (ఎస్ఈటీసీ) విడుదల చేసిన ప్రకటనలో... తిరుమల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 2వ తేది వరకు జరుగనున్నాయి.