Home » Chandra Babu
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తనను అభినందించిన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారత్ గొప్ప మార్పులోకి అడుగుపెడుతోందని కొనియాడుతూ చంద్రబాబు రీట్వీట్ చేశారు.
యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు తొలి రోజున పారిశ్రామికవేత్తలతో వరుస భేటీల్లో పాల్గొన్నారు. వాణిజ్య అనుకూల విధానాలున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. హైదరాబాద్లోని పవన్ నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి..
స్వర్ణనారా వారిపల్లి ప్రాజెక్టులో భాగంగా 45 రోజుల్లో 1,600 ఇళ్లకు సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసినందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కోచ్ పురస్కారం లభించింది.
రాష్ట్రంలో ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నీటిని సమర్థంగా నిర్వహిస్తే ఏ జిల్లాలోనూ కరవు అనే మాట రాదని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను బాగా అభివృద్ధి చేస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి తిరుమల సందర్శనలో పేర్కొన్నారు. గతంలో పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో లేదని, రివర్స్ అయ్యిందన్నారు.
జీఎస్టీ స్లాబ్లు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఫలితంగా నిత్యావసరాలు, విద్యా, ఆరోగ్య రంగం, వ్యవసాయ ఉత్పత్తులకు పన్నులు గణనీయంగా తగ్గుతాయని..
పంచెకట్టులో నిండైన రూపం.. పెదవులపై చెరగని దరహాసం..ఆనందంతో జనాలకు అభివాదం.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటిలా కాకుండా భిన్నంగా కనిపించారు, వ్యవహరించారు. అధినేతకు జేజేలు.. ప్రాంగణమంతా ఈలలు.. మాటమాటకీ పట్టలేని ఆనందంతో గోలగోలలు.. జడత్వాన్ని వదుల్చుకున్న జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబులో ఎన్నడూ లేని పులకింత కనిపించగా.. జనంలో నిస్తేజం పటాపంచలై కేరింతలతో వెల్లువెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఎప్పటిలా కాకుండా, నూతనత్వంతో ఆద్యంతం ఉత్సాహం ఉరకలు వేసేలా విజయవంతంగా సాగి ముగిసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుప్పం పర్యటనలో కడా ద్వారా ఆరు కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు.
ఈ నెల 25న రాజమండ్రిలో జరగాల్సిన వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. వినాయక చవితి తర్వాత జగన్ పర్యటన ఉండొచ్చని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు.