Home » Central Govt
రాష్ట్ర విద్యాశాఖలోని విప్లవాత్మక మార్పుల ప్రభావం.. తాజా పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం గ్లోబల్ స్థాయిలో పోటీ పడే సత్తాను సాధించారని ప్రశంసించారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపార సంస్థలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ECLGS 5.0 పథకానికి ఆమోదం తెలుపుతూ, దాదాపు రూ. 2.55 లక్షల కోట్ల రుణ పరపతిని కల్పించాలని నిర్ణయించింది.
దేశాభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కేంద్ర క్యాబినెట్ ఇవాళ సంచలన నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు ఆమోదం తెలుపుతూ దాదాపు రూ. 1,52,702 కోట్ల నిధులు మంజూరు చేసింది. మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, సెమీకండక్టర్, తదితర రంగాలకు ఈ నిధులను కేటాయించారు.
విశాఖపట్టణం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ గెజిట్ను కేంద్ర రైల్వే బోర్డు అధికారికంగా విడుదల చేసింది. జూన్ 1, 2026 నుంచి దక్షిణ కోస్తా రైల్వేను అధికారికంగా ప్రారంభించనుంది.
దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ రోజు (శనివారం) ఉదయం 11:46 గంటల సమయంలో మొబైల్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్ వచ్చింది. దాంతోపాటు.. కొన్ని సెకన్లపాటు సైరన్ మోగింది.
కేంద్ర ప్రభుత్వం అంతా ఊహించినట్టుగానే వ్యవహరిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన రేట్లు పెంచుతుందని ముందు నుంచే ఊహాగానాలు వస్తున్నాయి.
పెట్రోల్, డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలను భారత ప్రభుత్వం సవరించింది, అయినప్పటికీ వినియోగదారులకు రిటైల్ పెట్రో ధరలు యథాతథంగా ఉంటాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) ఒక ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం లేఖ రాశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థాయి దేశంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్ అని ప్రశంసించారు.
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆయనకు ఉన్న ప్రావీణ్యం దేశంలో ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు.