Home » CBI
వైఎస్ జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ కోర్టును ఆశ్రయించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత సెల్ నెంబర్కు బదులుగా మరో నెంబర్ ఇచ్చారంటూ..
దివంగత సీఎం జయలలిత మృతిపై జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐతో దర్యాప్తు చేయించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోమంత్రి అమిత్షా, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు విజ్ఞప్తి చేశారు.
సోషల్ మీడియా యాక్టివిస్టు సవీందర్రెడ్డిని అరెస్టు చేసిన వ్యవహారంలో సీబీఐ తదుపరి కార్యాచరణ చేపట్టవద్దని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సవీందర్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంపై దాఖలైన హెబియస్ కార్పస్పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది.
ప్రధానమంత్రి కార్యాలయ అధికారిగా నటించి రామారావు అనే వ్యక్తి మోసాలకు పాల్పడ్డాడు. మోసాలు చేస్తున్న రామారావుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో రామారావుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.
వైసీపీకి చెందిన తాడేపల్లి నేత సవింద్ర రెడ్డి పిటిషన్పై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం సవింద్ర రెడ్డి అక్రమ నిర్బంధం కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది.
సుగాలి ప్రతీ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సీబీఐకి అప్పగిస్తూ హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఉత్తర్వులు జారీచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాథమిక విచారణను సీబీఐ అధికారులు ప్రారంభించారు.
షాడో సీఎం ఆరోపణలపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. షాడో సీఎం ఎవరో ఆ వ్యక్తి పేరు, చేసిన పని ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎన్నో చూశానని సీఎం రేవంత్రెడ్డి చెప్పుకొచ్చారు.
బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాషకు సీబీఐ అధికారులు శనివారం నోటీసులు ఇచ్చారు. అనుమానిత నిందితుడు సత్యం బాబుపై నమోదైన పలు సెక్షన్లపై అభిప్రాయం తెలపాలంటూ ఆయేషా తల్లిదండ్రులకు సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శుక్రవారం హైదరాబాద్ వచ్చారు.