Home » Business news
ఐపీఓల(IPOs) వారం మళ్లీ వచ్చేసింది. దేశంలో లోక్సభ ఎన్నికల(loksabha election 2024) నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్ ఈనెలలో అస్థిరతను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారం రానున్న ఐపీఓల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో ఈరోజు (మే 12న) బంగారం(gold) ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ మే 11న సాయంత్రం బంగారం ధరలు దాదాపు రూ.300కుపైగా తగ్గాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,510గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,400కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు(chicken price) పెరిగాయి. దీంతోపాటు కోడి గుడ్ల రేట్లను(egg price) కూడా పౌల్ట్రీ సంస్థలు పెంచేశాయి. అయితే ఎండల వేడికి తట్టుకోలేక కోళ్లు భారీగా మృత్యువాత చెందిన క్రమంలో ఈ రేట్లు పెరిగినట్లు పౌల్ట్రీ యజమానులు చెప్పారు. కానీ ఇటివల కురిసిన వర్షాల నేపథ్యంలో మళ్లీ సామాన్య ప్రజలకు ఊరట లభించింది.
అక్షయ తృతీయ సందర్భంగా నిన్న బంగారం ప్రియులకు ఊరట నిచ్చిన గోల్డ్(gold) ధరలు సాయంత్రం తర్వాత క్రమంగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ ఏకంగా రూ. 1400 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదల సహా పలు అంశాలు భారత మార్కెట్పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
గురువారం భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు శుక్రవారం కాస్త కోలుకున్నాయి. 1000 పాయింట్లకు పైగా నష్టపోయి మదుపర్లకు నష్టాలను మిగిల్చిన సెన్సెక్స్ శుక్రవారం కాస్త ఉపశమనం కలిగించింది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభాల్లో పయనించాయి
దేశీయ స్టాక్ మార్కెట్లో(Stock market) గత రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు (మే 10) దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఫ్లాట్గా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 121 పాయింట్ల లాభంతో 72,525 వద్ద మొదలుకాగా, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 22,009 వద్ద ప్రారంభమైంది.
శుక్ల పక్షం తృతీయ రోజున జరుపుకునే పవిత్రమైన పండుగ అక్షయ తృతీయ(Akshaya Tritiya). ఈ సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ రోజు బంగారం కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు బ్యాంకులు ఉంటాయా లేదా హాలిడే(holiday) ఉందా. ఉంటే ఏ ప్రాంతాల్లో ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
అక్షయ తృతీయ(మే 10)(Akshaya Tritiya) సందర్భంగా ఈరోజు గోల్డ్(gold) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లలో బలహీనమైన ధోరణి కారణంగా దేశీయ మార్కెట్లో మళ్లీ బంగారం ధరలు క్షీణించాయి. ఈ క్రమంలో 10 గ్రాముల గోల్డ్ రేటు 350 రూపాయలకు పైగా తగ్గింది.
అక్షయ తృతీయకు ముందే గోల్డ్(gold) కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే నిన్న పెరిగిన పుత్తడి ధరలు, ఈరోజు(మే 9న) మళ్లీ పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పతనం అయిన క్రమంలో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.150 తగ్గింది.
లోక్సభ ఎన్నికలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో మదుపర్లు ఆచూతూచి అడుగులేస్తున్నారు. దీంతో బుధవారం కూడా దేశీయ సూచీలు రోజంతా ఒడిదుడుకుల మధ్యనే సాగాయి.