Home » BRS
హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. గత కొంత కాలంగా కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై స్థానిక నాయకత్వం తిరుగుబావుటా ఎగురవేసింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. సీఎం రేవంత్ రేపు(ఆదివారం) సిద్దిపేట పర్యటన నేపథ్యంలో పలు ప్రశ్నలు సంధిస్తూ లేఖ విడుదల చేశారు. రేపు సిద్దిపేట నియోజకవర్గానికి చేసిన ద్రోహం, నిధుల రద్దుపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.
పదో తరగతి పరీక్షలపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పదో తరగతి పరీక్షలు లేనట్లేనన్నారు. దేశమంతా +2 విధానం అమల్లో ఉందని ప్రస్తావించారు. తమది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. మంత్రి భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు.
గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
మొయినాబాద్ ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలకు ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’ విసిరారు. బీఆర్ఎస్ నేతల ఛాలెంజ్ స్వీకరించి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎల్బీనగర్ చేరుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రావడం వల్లనే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసీఆర్ రూ.300 కోట్లు మంజూరు చేసి ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించారని ప్రస్తావించారు.
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం రాష్ట్ర అభివృద్ధికి ఒక మార్గదర్శిగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం కేవలం ప్రభుత్వ కార్యక్రమాల జాబితా కాకుండా, భవిష్యత్తు తెలంగాణకు ఒక విజన్ డాక్యుమెంట్గా నిలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు. మూసీ పేరిట దోపిడీకి తాము వ్యతిరేకమని.. మూసీకి కాదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
మూసీ ప్రాజెక్ట్కు సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. పాకిస్థాన్లో బ్యాన్ చేసిన కంపెనీకి మూసీ డీపీఆర్ తయారీ బాధ్యత అప్పగించారని.. ఆ కంపెనీపై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అని మాజీ మంత్రి ప్రశ్నించారు.