Home » BJP
భార్యాభర్తల పంచాయితీలో తలదూర్చిన బీజేపీ నాయకుడు సామ రంగారెడ్డిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ ప్రగతినగర్లో నివసిస్తున్న మెతుకుపల్లి రవీందర్రెడ్డి కుమారుడు రిత్విక్రెడ్డికి, ఎల్బీనగర్కు చెందిన రొక్కం కృష్ణారెడ్డి కుమార్తె ఆకాంక్షరెడ్డితో వివాహం జరిగింది.
తప్పుడు వార్తలు రాయవద్దని, ఎవరి చేతుల్లో బలిపశువు కావద్దని మెదక్ ఎంపీ ఎం.రఘునందన్రావు జర్నలిస్టులకు సూచించారు. ఏదైనా అంశంపై కథనం రాసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోవాలని, వారు మాట్లాడడానికి స్పందించకపోతే స్పందించడం లేదని రాయాలని ఆయన సూచించారు.
పార్టీలో తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గ పరిధిలోని జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బిహార్ రాష్ట్రంలో ఎలాంటి ప్రజా లెక్కలు లేకుండా.. మైనారిటీ, క్రిస్టియన్ల ఓట్లని తొలగించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆ ఓట్లు పడవనే వాటిని తీసేశారని విమర్శించారు. ఓట్ల చోరీపై చర్చ చేస్తే దొంగలెవరో బయటపడుతారని ఎద్దేవా చేశారు. అందుకోసమే.. కనీసం చర్చ కూడా చేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతారని మండిపడ్డారు.
ఇండీ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన ఒక తీర్పు కారణంగా కొన ఊపిరితో ఉన్న నక్సలైట్ ఉద్యమం మరో రెండు దశాబ్దాల పాటు దేశంలో మనగలిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని.. రెండు పార్టీలు కలిసి యూరియా విషయంలో బీజేపీపై నిందలు వేయాలని చూస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు.
మొట్టమొదటి ‘ప్రపంచ అయ్యప్ప సంగమం’ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన కేరళ సీఎం విజయన్పై బీజేపీ మండిపడింది.
పెద్ద మోదీ, చిన్న మోదీ ఒకే రకంగా ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇద్దరూ కలిసి రాహుల్కు పెద్ద షాక్ ఇవ్వటం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు.
మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ నిర్వహించనున్న సమన్వయ సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె, సహ కార్యవాహ్లు (జాయింట్ జనరల్ సెక్రటరీలు), సమన్యయకర్తలతో సహా ఆర్ఎస్ఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గోనున్నారు.
హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రమూర్తితో తనను పోల్చవద్దంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి అమిత్షా తిరునల్వేలి పర్యటన సందర్భంగా శ్రీరాముడి వేషధారణతో తన ఫొటోలున్న పోస్టర్లను అతికించడమే కాకుండా ఆ రూపంతో ఉన్న జెండాలు కూడా కార్యకర్తలు ఎగురవేయడంపై తాను తీవ్ర ఆవేదన చెందానని ఓ ప్రకటనలో తెలిపారు.