Home » BJP
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను తప్పకుండా అరెస్ట్ చేస్తారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. బండి సంజయ్ కొడుకు పరారీలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిఖార్సైన కాంగ్రెస్ లీడర్ అని చెప్పుకొచ్చారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అన్ని విషయాల్లో ఏకరూపత కోరుకునే బీజేపీ.. బంధువుల విషయానికి వస్తే రెండు ప్రమాణాలను పాటిస్తోందంటూ వ్యాఖ్యానించారు.
నీట్ పరీక్ష రద్దుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర మానవ వనరుల శాఖ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాధ్యత వహించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థులు తమ అకడమిక్ ఇయర్ను కోల్పోయే అవకాశం ఉందన్నారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ పార్టీ తొలిసారి అద్భుత విజయం సాధించిందని, తెలంగాణలోనూ బెంగాల్ పరిస్థితులు కనిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
జై శ్రీరామ్ నినాదంతోనే గడీలను బద్దలుకొట్టామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జై శ్రీరామ్ నినాదంతోనే పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చామని, అదే నినాదంతో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల భవనాలపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉండడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడి జరగవచ్చన్న పక్కా సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. అయితే, ప్రజలు మాత్రం ఎన్నికలు ఏవైనా రాజకీయ పార్టీలకు తమదైన రీతిలో సంకేతాలు, సందేశాలు పంపుతుంటారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు.
టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మాజీ బౌలర్ అశోక్ దిండా పశ్చిమ బెంగాల్లో కొలువుదీరిన క్రీడా మంత్రిగా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294కు గానూ 206 స్థానాల్లో గెలిచి బీజేపీ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే.
డీజీపీ సీవీ ఆనంద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ కార్యకర్తల దాడి అంశంపై డీజీపీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.